యాప్నగరం

గవర్నర్ బదులు జాతీయ జెండా ఎగరేసిన సీఎం

గవర్నర్ బదులు ముఖ్యమంత్రే త్రివర్ణ పతకాన్ని ఎగరేయడం ఏంటి అనుకుంటున్నారా?

TNN 26 Jan 2017, 3:53 pm
దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. జల్లికట్టు ఆందోళనలతో తీవ్రంగా అట్టుడుకిన తమిళనాట కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. కానీ.. ఆనవాయితీ ప్రకారం గవర్నర్ పతాకావిష్కరణ చేయాల్సి ఉండగా.. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం త్రివర్ణ పతాకాన్ని ఎగురేశారు. తమిళనాడు గవర్నర్‌గా కొణిజేటి రోశయ్య పదవీకాలం ముగిశాక... ఆ రాష్ట్రానికి పూర్తిస్థాయి గవర్నర్‌ను నియమించలేదు. మహారాష్ట్ర గవర్నర్ అయిన సీహెచ్ విద్యాసాగర రావును సెప్టెంబర్ 2న తమిళనాడు ఇంఛార్జ్ గవర్నర్‌గా నియమించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం గవర్నర్ ముంబైలో వెళ్లడంతో పన్నీర్ సెల్వమే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Samayam Telugu tamilnadu cm pannnerselvam hoists national flag on republic day
గవర్నర్ బదులు జాతీయ జెండా ఎగరేసిన సీఎం



ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఎగురవేయడం తమిళనాడు చరిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం. మెరీనా బీచ్‌లో పన్నీర్ సెల్వానికి ఆహ్వానం పలికిన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ.. ఆయనకు త్రివిధ దళాధిపతులను పరిచయం చేశారు. ఈ వేడుకలకు సాధారణ ప్రజలు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.