యాప్నగరం

గవర్నర్‌తో భేటీ అయిన పన్నీర్‌సెల్వం, పళనిసామి

తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడుతున్న పళనిసామి, పన్నీర్‌సెల్వంలు బుధవారం రాత్రి...

TNN & Agencies 15 Feb 2017, 9:26 pm
తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడుతున్న పళనిసామి, పన్నీర్‌సెల్వం వేర్వేరుగా ఆ రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ అయ్యారు. రాత్రి 7:30 గంటలకి పళనిసామి, రాత్రి 8:30 గంటలకి పన్నీర్సెల్వం గవర్నర్ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై ఆయనతో చర్చించారు. ఏఐఏడీఎంకే తరపున గవర్నర్ని కలిసిన వారిలో పళనిసామి, సెంగొట్టియన్, జయకుమార్ ఉన్నారు. తమకి 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని వివరిస్తూ గవర్నర్కి ఓ లేఖ అందజేసిన పళనిసామి తమని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఆయనను కోరారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పళనిసామి... గవర్నర్ నుంచి త్వరలోనే ఆహ్వానం వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.
Samayam Telugu tamilnadu governor vidyasagar meeting with pannerselvam and palanisamy
గవర్నర్‌తో భేటీ అయిన పన్నీర్‌సెల్వం, పళనిసామి


రాత్రి 9:05 గంటల ప్రాంతంలో గవర్నర్ తో పన్నీర్ సెల్వం భేటీ ముగిసింది. భేటీ అనంతరం బయటికి వచ్చిన పన్నీర్‌సెల్వం మీడియాతో మాట్లాడకుండానే తన ఎమ్మెల్యే బృందంతో కలిసి నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు. అయితే, పన్నీర్‌సెల్వం మొదటి నుంచీ చెబుతూ వస్తున్నట్టుగానే తనకి ళ అవకాశం ఇస్తే, అసెంబ్లీలో తనకున్న మద్దతు నిరూపించుకుంటానని గవర్నర్‌ని కోరినట్టు పన్నీర్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో ఆ ఇద్దరి వాదనలు విన్న గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి వుంది. పళనిసామి కోరినట్టుగా నేరుగా ఆయనకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానిస్తారా లేక పన్నీర్ సెల్వం కోరుతున్నట్టుగా అతడికి ఓ అవకాశం కల్పిస్తారా అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.

వాస్తవానికి పన్నీర్‌సెల్వం వెంట ప్రస్తుతం 8 మంది ఎమ్మెల్యేలే వున్నారు. అయితే, మిగతా ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలని ఆ పార్టీ స్వేచ్ఛగా విడిచిపెడితే, వారు కూడా తనకే మద్దతు పలుకుతారని విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు పన్నీర్‌సెల్వం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.