యాప్నగరం

నాకివన్నీ ఏం కొత్త కాదు -శశికళ

గోల్డెన్ బే రిసార్ట్స్‌కి చేరుకున్న శశికళ అక్కడ ఎమ్మెల్యేలతో భేటీ అయి తదుపరి కార్యాచరణ గురించి

TNN 12 Feb 2017, 5:58 pm
గోల్డెన్ బే రిసార్ట్స్‌కి చేరుకున్న శశికళ అక్కడ ఎమ్మెల్యేలతో భేటీ అయి తదుపరి కార్యాచరణ గురించి చర్చించారు. గోల్డెన్ బే రిసార్ట్స్‌కి వెళ్లడానికన్నా ముందే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పందించిన శశికళ... 'ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు' అని ఆవేదన వ్యక్తంచేశారు. అమ్మ(జయలలిత) బతికున్నప్పటి నుంచే పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని.. అప్పటి నుంచే అవన్నీ గమనిస్తూ వస్తున్నానని అన్నారు. ఏదేమైనా ఏఐఏడీఎంకే పార్టీ తన నేతృత్వంలోనే పనిచేస్తుందని.. మరో నాలుగున్నరేళ్లు తమ పార్టీనే అధికారంలో వుంటుందని శశికళ ధీమా వ్యక్తంచేశారు.
Samayam Telugu tamilnadu it is very difficult for a woman to be in politics sasikala
నాకివన్నీ ఏం కొత్త కాదు -శశికళ


" రాజకీయాల్లో మహిళలని ఇబ్బందులకి గురిచేయడం ఇవాళ కొత్త కాదు. చివరకు అమ్మ ( దివంగత సీఎం జయలలిత) కూడా ఎన్నో సవాళ్లు ఎదుర్కున్నారు. ఈ 33 ఏళ్లపాటు నేను కూడా ఆమెతో కలిసే ఈ సవాళ్లన్నీ ఎదుర్కున్నాను" అని స్పష్టంచేశారు శశికళ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.