యాప్నగరం

ఇప్పుడు చిన్నమ్మ వంతు... అమ్మ సమాధి చెంతకు

తమిళనాట రాజకీయ రణరంగం రసవత్తరంగా సాగుతోంది. గత రెండు రోజులుగా ఆసక్తికరణమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

TNN 8 Feb 2017, 10:24 am
తమిళనాట రాజకీయ రణరంగం రసవత్తరంగా సాగుతోంది. గత రెండు రోజులుగా ఆసక్తికరణమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ పక్క అధికార పీఠం కోసం పావులు కదుపుతోన్న శశికళకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పంటికింద రాయిలా మారారు. తనతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ పన్నీర్ సెల్వం ఆరోపించడమే కాకుండా తనను రెచ్చగొడితే మొత్తం బండారాన్ని బయటపెటతానంటూ శశికళను హెచ్చరిస్తున్నారు.
Samayam Telugu tamilnadu political drama sasikala today will visited to jayasamadi
ఇప్పుడు చిన్నమ్మ వంతు... అమ్మ సమాధి చెంతకు


జయలలిత సమాధి సాక్షిగా పన్నీర్ సెల్వం రాజకీయ సునామీకి తెరలేపిన వేళ, అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ అమ్మ సమాధి వద్దకు పయనమయ్యారు. నిన్న రాత్రి పన్నీర్ సెల్వం జయ సమాధి సాక్షిగా తిరుగుబాటు బావుటాను ఎగురవేయడంతో అక్కడికే వెళ్లి తన నెచ్చలికి నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే మెరీనా తీరానికి అటు శశికళ అనుకూల, వ్యతిరేక వర్గాలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులను ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అటు తమిళనాడులో మెజార్టీ ప్రజలు పన్నీర్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.