తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఏఐఏడీఎంకే లోక్సభా పక్ష నేత తంబిదొరై బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులని తంబిదొరై ఈ సమావేశంలో మోడీకి వివరించారు.
అయితే, తంబిదొరై విజ్ఞప్తిపై స్పందించిన మోడీ.. ఎమ్మెల్యేలని కలుపుకునిపోయి, రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేయాల్సిందిగా ఆయనకు సూచించారు. ఈ విషయమై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా తంబిదొరైకి ఇదే సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.
అయితే, తంబిదొరై విజ్ఞప్తిపై స్పందించిన మోడీ.. ఎమ్మెల్యేలని కలుపుకునిపోయి, రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేయాల్సిందిగా ఆయనకు సూచించారు. ఈ విషయమై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా తంబిదొరైకి ఇదే సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.