యాప్నగరం

ఫోన్ దొంగిలించిన వ్యక్తిని వెంబడిస్తూ.. ఊహించని విషాదం.. పాపం టీచర్!

మధ్యప్రదేశ్‌లోని షాదోల్ రైల్వే స్టేషన్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. అర్జెంట్‌గా కాల్ మాట్లాడాలి ఓసారి ఫోన్ ఇవ్వమని తీసుకున్న వ్యక్తి.. రైలు స్లో కాగానే దూకి పారిపోగా.. అతణ్ని వెంబడించే క్రమంలో ఓ టీచర్ ప్రాణాలు కోల్పోయాడు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 17 May 2022, 12:02 pm
మృత్యువు ఎప్పుడు ఎలా కబళిస్తుందో చెప్పలేం. అప్పటి వరకూ మన కళ్ల ముందే ఉన్న వ్యక్తి అనూహ్యంగా మరణిస్తాడు. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఫోన్ దొంగిలించిన వ్యక్తిని వెంబడించే క్రమంలో ఓ టీచర్ రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రాత్రి షాదోల్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జీఆర్పీ సిబ్బంది వెల్లడించారు.
Samayam Telugu Mobile phone
Representative Image


ప్రయివేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేసే మనోజ్ నీమా (54) ఆదివారం రాత్రి దుర్గ్-అజ్మేర్ రైలులో సాగర్ వెళ్తున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మనోజ్‌ దగ్గరకు వచ్చి అర్జెంట్‌గా ఒకరితో మాట్లాడాలంటూ ఫోన్ అడిగారు. నిజమేనని నమ్మిన మనోజ్ అతడికి ఫోన్ ఇచ్చారు. షాదోల్ స్టేషన్‌ సమీపించగానే రైలు నెమ్మదించగా.. ఆ వ్యక్తి ఫోన్ తీసుకొని పరారయ్యాడు.

దీంతో మనోజ్ సైతం రైలు దిగి తన ఫోన్ తీసుకెళ్తున్న వ్యక్తిని వెంబడించాడు. కానీ కొంత దూరం వెళ్లాక చీకట్లో సరిగా కనిపించకపోవడంతో రైల్వే ట్రాక్‌పై పడిపోయారు. అదే సమయంలో అటుగా రైలు రావడంతో.. మనోజ్ దాని కింద నలిగి ప్రాణాలు కోల్పోయారని జీఆర్పీ ఏఎస్సై జీతూ సింగ్ తెలిపారు. అనుమానితుణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతణ్ని షాదోల్‌లోని ఖేరీ గ్రామానికి చెందిన రాజేంద్ర సింగ్‌గా గుర్తించారు. అతడి దగ్గర్నుంచి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.