యాప్నగరం

Karnataka: కసాయిలా ప్రవర్తించిన టీచర్... సెకండ్ క్లాస్ విద్యార్థిపై మరిగే నీళ్లు పోశాడు

కర్ణాటకలో (Karnataka) ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పిల్లలను దగ్గరగా తీసుకుని.. వారికి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు.. వారి పట్ల కసాయిలా ప్రవర్తించాడు. రెండో తరగతి విద్యార్థిపై వేడి వేడి నీళ్లు పోసేశాడు. దాంతో బాలుడు గాలిన గాయాలతో విలవిల్లాడిపోతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. తనపై ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు పైగా బాలుడి తల్లిదండ్రులను బెదిరిస్తున్నాడు. మరోవైపు ఫిర్యాదు చేయనిదే చర్యలు తీసుకోమని పోలీసులు అంటున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 9 Sep 2022, 9:44 pm
Karnataka: కొంతమంది టీచర్లు మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పసివాళ్లపై కసి తీర్చుకుంటున్నారు. చిన్న తప్పులకే.. ఊహించని విధంగా శిక్షిస్తున్నారు. కర్ణాటకలో ఇలాంటి అమానుషమైన సంఘటన జరిగింది. రాయచూర్ జిల్లాలోన సంతేకళ్లూరు గ్రామంలో ఘనమఠేశ్వర గ్రామీణ సంస్థ నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలలో ఓ టీచర్.. పిల్లవాడిపై వేడి వేడి నీళ్లు పోశాడు.
Samayam Telugu Teacher Student Hot Water


స్కూల్ యూనిఫాంలో మలవిసర్జన చేసినందుకు ఓ ఉపాధ్యాయుడు హులిగెప్ప రెండో తరగతి విద్యార్థి అఖిత్‌పై మరిగే నీళ్లు వేశాడు. దాంతో ఆ పిల్లవాడు విలవిల్లాడిపోయాడు. ఒళ్లంతా 40 శాతం కాలిన గాయాలయ్యాయి. దాంతో అఖిత్‌ని వెంటనే లింగసగూరు తాలూకా ఆస్పత్రికి తరలించగా.. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఆ ఉపాధ్యాయుడికి ఈ దారుణంతో ఆగిపోలేదు. తనపై ఫిర్యాదు చేయకుండా బాలుడి కుటుంబాన్ని బెదిరించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు అఖిత్ తల్లిదండ్రులకు స్థానిక నేతల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్టు సమాచారం. మరోవైపు తమకు కంప్లైంట్ ఇవ్వనిదే ఎలా చర్యలు తీసుకోలేమని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత నిందితుడు టీచర్ పాఠశాలకు వెళ్లడం మానేశాడు. ఈ విషయంపై విచారణకు అధికారులు సుమోటుగా తీసుకోవాలని కొంతమంది కోరుతున్నారు. కాగా బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

కాగా కర్ణాకటలో నాలుగు రోజుల ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో తన ప్యాంట్‌లో మూత్ర విసర్జన చేసినందుకు మూడేళ్ల బాలుడి ప్రైవేట్ భాగాలపై దాడి అంగన్‌వాడీ కార్యకర్త దాడి చేసింది. దాంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం రాజస్థాన్‌లో తన కుండలో నీళ్లు తాగినందుకు.. ఓ దళిత విద్యార్థిని.. ఉపాధ్యాయుడు విచక్షణా రహితంగా కొట్టాడు. దాంతో ఆ అబ్బాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

Read Also:ఏంటి ఈ మాత్రం దానికే ఫైన్ వేస్తారా?.. పాపం టైలర్‌పై కన్నెర్ర చేసిన కోర్టు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.