యాప్నగరం

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు: ఓట్ల లెక్కింపు ప్రారంభం

తెలంగాణ వ్యాప్తంగా 43 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగుతోంది. అత్యధికంగా హైదరాబాద్‌ నగరంలో 13 ప్రాంతాల్లో, మిగిలినవి ఒక్కో జిల్లాలో ఒక్కో లెక్కింపు కేంద్రం చొప్పున ఏర్పాటు చేశారు.

Samayam Telugu 11 Dec 2018, 8:16 am
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓటరు తీర్పును గత మూడు రోజులుగా నిక్షిప్తం చేసి ఉన్న ఈవీఎంలు ఉదయం 8 గంటలకు తెరుచుకోనున్నాయి.
Samayam Telugu Elections


తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో స్వతంత్రులతో కలిపి మొత్తం 1,821 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.81 కోట్ల మంది ఓటర్లలో 73.2 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగుతోంది. అత్యధికంగా హైదరాబాద్‌ నగరంలో 13 ప్రాంతాల్లో, మిగిలినవి ఒక్కో జిల్లాలో ఒక్కో లెక్కింపు కేంద్రం చొప్పున ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి ఈవీఎంలను బయటకు తీసుకువచ్చి లెక్కింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అలాగే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా వీటిని భావిస్తుండటంతో ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్నందున ఈ ఫలితాలు ఎలాంటి రాజకీయ సమీకరణాలకు దారితీస్తాయోననే ఉత్కంఠ రాజకీయ పక్షాల్లో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.