ఉన్నత చదువు కోసం దాదాపు 120 మంది తెలుగు విద్యార్థులు శ్రీనగర్ నిట్లో చేరారు. చదువు సజావుగా సాగుతుందనుకున్న సమయంలో అనుకోని కలకలం వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ఇప్పుడు క్యాంపస్ లోంచి అడుగు కూడా బయటపెట్టలేని పరిస్థితి. ఇప్పటికే జరిగిన కల్లోలంలో 50 మంది దాకా తెలుగు విద్యార్థులు గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో తమ పిల్లలు ఎలా ఉన్నారో తెలియక ఆంధ్ర, తెలంగాణాల్లో ఉన్న వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిని ఎలాగైనా తిరిగి స్వరాష్ట్రానికి రప్పించాలని ప్రభుత్వాలని వేడుకుంటున్నారు. కాగా శుక్రవారం ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మళ్లీ ఆందోళన చేపట్టారు. మెయిన్ గేటు నుంచి వారిని బయటికి వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. గేటు బయట ఉన్న మీడియాతో మాట్లాడడానికి అనుమతించమని కోరినా... పోలీసులు బయటికి వెళ్లనివ్వలేదు. దీంతో వారు నినాదాలు చేశారు. రెండు రోజుల ముందు ఇతర రాష్ట్రాల విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థులు మాత్రం తమ చదువుకు ఆటంకం కలగకుండా చూడాలని... శ్రీనగర్ నుంచి నిట్ ను వేరే రాష్ట్రానికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎన్ఐటీలో మనవారి పరిస్థితి ఇంకా అధ్వానమే
ఉన్నత చదువు కోసం దాదాపు 120 మంది తెలుగు విద్యార్థులు శ్రీనగర్ నిట్లో చేరారు.
TNN 9 Apr 2016, 9:24 am