యాప్నగరం

Maharashtra Rains: పోటెత్తిన వరద నీరు.. నాసిక్‌లో నీట మునిగిన ఆలయాలు

వర్షాలు, వరదలకు మహారాష్ట్ర (Maharashtra Rains) కుదేలవుతుంది. ఇప్పటికే అక్కడ వరదల వల్ల 76 మంది చనిపోయారు. కేవలం ఒక్కరోజులోనే 9 మంది చనిపోయారు. గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నాసిక్‌లో పలు ఆలయాలు నీట మునిగాయి.

Authored byAndaluri Veni | Samayam Telugu 11 Jul 2022, 4:37 pm
మహారాష్ట్రలో (Maharashtra Rains) ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాంతో గోదావరి నదిలోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. భారీ స్థాయిలో వరద నీరు పోటెత్తతడంతో నాసిక్ దగ్గర నదిలో ప్రవాహం భారీగా పెరిగింది. నదిలో నీటి ప్రవాహం వేగం పెరిగింది. దీంతో అక్కడ పలు ఆలయాలు నీట మునిగాయి. ఈ పరిణామంతో నదికి ఇరువైపులా వాహనాల రాకపోకలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి.
Samayam Telugu Temples in Nashik Submerged



వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు మహారాష్ట్రలో 76 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం 24 గంటల్లోనే తొమ్మిది మంది చనిపోయారు. పిడుగుపాటు, కొండ చరియలు విరిగిపడటం, చెట్లు కూలిపోవడం, వరదల వల్ల వారంతా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. అలాగే సుమారు ఎనిమది వందలకుపైగా ఇళ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. అలాగే వరదల వల్ల నిరాశ్రయులైన వారి కోసం సహాయ శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు.

అంతేకాదు జూన్ ఒకటో తేదీ నుంచి దాదాపు 125 జంతువులు కూడా ప్రాణాలు కోల్పోయాయి. అలాగే ఈ వర్షాలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. జూలై 12 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కొంకణ్ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో 64 మిల్లిమీటర్ల నుంచి 200 మిల్లీమీటర్ల మేరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.