యాప్నగరం

ఇల్లు ఖాళీ చేయించేందుకు 52ఏళ్లు పట్టింది

అద్దెకు ఇచ్చిన ఇంటిని నుంచి కిరాయిదారుడిని ఖాళీ చేయించేందుకు ఇంటి యజమానికి ఏకంగా 52 ఏళ్లు పట్టింది. కిరాయిదారుడు తన తెలివి తేటలు అన్నీ ఉపయోగించి యజమానిని ముప్పు తిప్పలు పెట్టాడు. ఈ కేసు వివరాలు తెలుసుకొని సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ముక్కున వేలేసుకుంది.

TNN 27 Jan 2018, 5:28 pm
కోర్టు మెట్లు ఎక్కినా గాడిది మీది ఎక్కినా ఒక్కటే అని చాలా మంది కక్షిదారులు అంటూ ఉంటారు. కేసు ఓడిపోయిన వాళ్లు కోర్టులో ఏడిస్తే ... న్యాయవాది ఖర్చులు లెక్కేసుకొని కేసు గెల్చిన వాళ్లు ఇంటికొచ్చి ఏడుస్తారనే సామెత కూడా ఉంది. సరిగ్గా అలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. అద్దెకు ఇచ్చిన ఇంటిని నుంచి కిరాయిదారుడిని ఖాళీ చేయించేందుకు ఇంటి యజమానికి ఏకంగా 52 ఏళ్లు పట్టింది. కిరాయిదారుడు తన తెలివి తేటలు అన్నీ ఉపయోగించి యజమానిని ముప్పు తిప్పలు పెట్టాడు. ఈ కేసు వివరాలు తెలుసుకొని సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ముక్కున వేలేసుకుంది. తక్షణమే ఇల్లు ఖాళీ చేసి యజమానికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పటికీ వెనక్కి తగ్గని కిరాయిదారుడు ఇళ్లు ఖాళీ చేసేందుకు ఆరు నెలల గడవు కోరగా కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. నెల రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయాల్సిందే అని ఆదేశించింది.
Samayam Telugu tenant overstays for 52 years after court order shocked sc finally
ఇల్లు ఖాళీ చేయించేందుకు 52ఏళ్లు పట్టింది


గుజరాత్ కు చెందిన బీఎం పటేల్‌ అనే వ్యక్తి 1965లో తన ఇంటిని ఎంకే బారోత్‌ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా ఎంకే బారోత్ కు సూచించారు. అయితే బారోత్‌ కోర్టుకు ఎక్కాడు. అలా ఏకంగా అయిదు దశాబ్దాల పాటు పలు కోర్టుల్లో కేసు నడిచింది. ఎట్టేకేలకు అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ పిటిషన్‌ విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ముందు షాక్ కు గురయ్యారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఇంటి యజమానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.