కేంద్రమంత్రి గడ్కరీకి సచిన్ లేఖ రాశారు. అక్రమాలకు పాల్పడుతున్న హెల్మెట్ల కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. నాణ్యతలేని మెటిరీయల్తో హెల్మెట్లు తయారు చేసి... ఐఎస్ఐ మార్కు వేస్తున్నారంటూ కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఓ క్రికెటర్గా హెల్మెట్ ఎంత ముఖ్యమో తనకు తెలుసని... అలాంటి వాటి విషయంలో మరీ ఇంత దారుణంగా ప్రవర్తించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. క్వాలిటీ ఉన్న హెల్మెట్లు ఉంటేనే ప్రమాదాల బారి నుంచి బయటపడొచ్చు... జనాలు తెలియక ఇలాంటి నకిలీ వాటినే కొనుగోలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశంలో 70శాతంమంది వీటిని తీసుకోవాల్సి వస్తోందన్నారు. గతేడాది జరిగిన ప్రమాదాలను కూడా ఆయన ప్రస్తావించారు. నాణ్యమైన హెల్మెట్లు లేకపోవడం వల్లే ప్రమాదాల్లో ఎక్కువమంది చనిపోతున్నారని లేఖలో రాశారు.
ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని... అందుకే ఈ అంశాన్ని మీ దృష్టికి తెస్తున్నానని లేఖలో వివరించారు. నకిలీ హెల్మెట్లు ధరించే వారు ఎక్కువమంది ఉన్నారు. హెల్మెట్ పెట్టుకున్నా కూడా వారు ఎందుకు చనిపోయారంటే.. వారు ధరించింది నాణ్యమైనవి కాదు. వెంటనే దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి... నాణ్యతలేని హెల్మెట్లు తయారు చేస్తున్న ఫ్యాక్టరీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని గడ్కరీని కోరారు. గతంలో కూడా సచిన్ ఎన్నో సందర్భాల్లో హెల్మెట్లు ఎంత ముఖ్యమో చెప్పుకొచ్చారు. ట్విట్టర్ ద్వారా కొందరు అభిమానుల్ని హెచ్చరించిన అంశాన్ని ప్రస్తావించారు.
Read This Story Also In English
ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని... అందుకే ఈ అంశాన్ని మీ దృష్టికి తెస్తున్నానని లేఖలో వివరించారు. నకిలీ హెల్మెట్లు ధరించే వారు ఎక్కువమంది ఉన్నారు. హెల్మెట్ పెట్టుకున్నా కూడా వారు ఎందుకు చనిపోయారంటే.. వారు ధరించింది నాణ్యమైనవి కాదు. వెంటనే దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి... నాణ్యతలేని హెల్మెట్లు తయారు చేస్తున్న ఫ్యాక్టరీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని గడ్కరీని కోరారు. గతంలో కూడా సచిన్ ఎన్నో సందర్భాల్లో హెల్మెట్లు ఎంత ముఖ్యమో చెప్పుకొచ్చారు. ట్విట్టర్ ద్వారా కొందరు అభిమానుల్ని హెచ్చరించిన అంశాన్ని ప్రస్తావించారు.
Read This Story Also In English