యాప్నగరం

మోదీ సభలో అపశ్రుతి.. టెంట్ కూలి 20 మందికి గాయాలు

ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. మిడ్నాపూర్‌లో ప్రధాని పాల్గొన్న సభలో ఓ టెంట్ కూలిపోయిన ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు.

TNN 16 Jul 2018, 4:59 pm
ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. మిడ్నాపూర్‌లో ప్రధాని పాల్గొన్న సభలో ఓ టెంట్ కూలిపోయిన ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రధాని తన ప్రసంగం కొనసాగిస్తుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే ప్రసంగం ఆపేసిన ప్రధాని తన గాయపడిన వారికి సాయం అందించాల్సిందిగా తన వ్యక్తిగత సిబ్బందిని పురమాయించారు. దీంతో ఎస్పీజీ సిబ్బంది, ప్రధాని సిబ్బందిలోని ఓ వైద్యుడు ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి స్థానిక అధికారులతో కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Samayam Telugu wb


ప్రసంగం ముగించుకున్న వెంటనే ప్రధాని మోదీ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటన పట్ల పశ్చిమ బెంగాల్‌లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. సాక్షాత్తూ ప్రధాని పాల్గొన్న ఓ సభలోనే భద్రతా చర్యలు ఈ రీతిని ఉంటే ఎలా అని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధాని వెళ్లే మార్గంలో కొంత మంది ఆయనకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.

ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రకటించారు..

కూలిన టెంట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.