కాశ్మీర్లో మరో ఉగ్రవాది హతం
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ దాడికి ప్రయత్నించారు.
TNN 22 Sep 2016, 10:49 am
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ దాడికి ప్రయత్నించారు. ఆ దాడిని భద్రతా దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. బందిపోరా జిల్లా అర్గమ్ గ్రామంలో ఉగ్రవాదులు అడుగుపెట్టినట్టు భద్రతా దళాలకు సమాచారం అందింది. ఆ గ్రామాన్ని దళాలు చుట్టుముట్టాయి. దీంతో ఓ ఇంట్లోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. ఆ ఇంట్లోంచి ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు కూడా తిరిగి కాల్పులు జరిపారు. ఓ ఉగ్రవాదిని హతమార్చారు. ఇంట్లో ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో తెలియరాలేదు. ఇద్దరు లేదా ముగ్గురు ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా కాల్పులు జరుగుతున్నాయి. యూరీ ఘటనతో భారత ప్రభుత్వమే కాదు, ఇండియన్ ఆర్మీ కూడా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. కానీ ఇది సమయం కాదని సంయమనంతో ఉంటుంది. కాశ్మీర్లో మరింత సైన్యం సోదాలు చేస్తోంది. దేశంలోకి అడుగుపెట్టిన ఉగ్రవాదులను మట్టుబెడుతోంది. భద్రతను మరింతగా పెంచింది.
Militants of the Pakistan-based Jaish-e-Muhammad entered Argom village in Bandipora Dist, kahmir. One militant killed by BSF personnel. The gun fighting was continuing till the last reports came in.
Militants of the Pakistan-based Jaish-e-Muhammad entered Argom village in Bandipora Dist, kahmir. One militant killed by BSF personnel. The gun fighting was continuing till the last reports came in.