అసోంలోని కోక్రాజార్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వారానికి ఒకసారి నిర్వహించే సంత జరుగుతున్న సందర్భంగా.. ఉగ్రవాదులు తుపాకీలతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మరో 15 మంది గాయపడ్డారని తెలుస్తోంది. దీంతో అక్కడికి చేరుకున్న భద్రతా దళాలు ఉగ్రవాదిని హతమార్చి ఏకే 47 గన్ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొని ఉంటారని భావిస్తున్న భద్రతా దళాలు మిగతా ఇద్దరి కోసం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. కాల్పులు ప్రారంభించడానికి ముందు ఉగ్రవాదులు గ్రెనేడ్ విసరడంతో మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ (ఎస్) ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడ్డారని అసోం డీజీపీ ముకేశ్ సహాయ్ తెలిపారు. ఈ దాడి గురించి అసోం ముఖ్యమంత్రి సోనోవాల్ ప్రధానితో మాట్లాడారు. పట్టపగలే ఉగ్రవాదులు జనంపై దాడులకు తెగబడటం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఇండిపెండెన్స్ డే వేడుకల కోసం గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. ఇద్దరు వ్యక్తులు ఆటోలో కూర్చోగా, నల్లటి రెయిన్ కోట్ ధరించిన వ్యక్తితో తుపాకీతో కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. అతడు విచక్షణారహితంగా కాల్పులు జరపలేదని, ఒక్కొక్కరినే లక్ష్యం చేసుకొని కాల్పులు జరిపాడని ఆయన తెలిపాడు.
అసోంలో 14 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
అసోంలోని కోక్రాజార్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వారానికి ఒకసారి నిర్వహించే ..
TNN 5 Aug 2016, 3:15 pm