యాప్నగరం

పోలీసుల కుటుంబ సభ్యుల్ని అపహరించిన ఉగ్రవాదులు

అంతర్జాతీయ ఉగ్రవాది సయ్యద్ సలావుద్దీన్ రెండో కుమారుణ్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసిన రోజే ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు.

Samayam Telugu 31 Aug 2018, 8:49 am
కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగారు. గురువారం రాత్రి సమయంలో దక్షిణ కశ్మీర్లో పోలీసుల కుటుంబీకులను అపహరించారు. అంతర్జాతీయ ఉగ్రవాది సయ్యద్ సలావుద్దీన్ రెండో కుమారుణ్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసిన రోజునే ఉగ్రవాదులు ఈ దురాగతానికి పాల్పడటం గమనార్హం. పోలీసుల రక్త సంబంధీకులను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లిన విషయాన్ని కశ్మీర్ పోలీస్ యంత్రాంగం వెంటనే అధికారికంగా ప్రకటించలేదు. కిడ్నాప్ వార్తలను నిర్ధారించకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Samayam Telugu jk police.


ఉగ్రవాదులు కనీసం ఐదుగుర్ని ఎత్తుకెళ్లారని తెలుస్తోంది. వీరంతా జమ్మూ కశ్మీర్ పోలీస్ విభాగంలో పని చేస్తున్న వారి కుటుంబ సభ్యులని సమాచారం. షోపియాన్, కుల్గాం, అనంతనాగ్, అవంతిపోరా ప్రాంతాల నుంచి వీరిని ఉగ్రవాదులు అపహరించినట్టు తెలుస్తోంది.

ఈ వార్తలతో వెంటనే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం దక్షిణ కశ్మీర్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఉగ్రవాదుల కోసం, అపహరణకు గురైన వారిని గుర్తించడం కోసం.. భారీ ఎత్తున వెతుకులాట ప్రారంభించాలని అత్యున్నత స్థాయి భద్రతా సమావేశంలో నిర్ణయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.