యాప్నగరం

ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి.. ఇద్దరికి తీవ్రగాయాలు

కశ్మీర్‌లో ఓ వైపు తీవ్రవాదుల దాడులు, పాక్ సైన్యం ఆగడాలకు హద్దులేకుండా పోతుంది. వారం వ్యవధిలోనే సైన్యంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడటం గమనార్హం.

TNN 10 Feb 2018, 8:03 am
జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ స్థావరంపై ఉగ్రవాదులు మరోసారి దాడికి పాల్పడ్డారు. వారం వ్యవధిలో తీవ్రవాదులు దాడికి తెగబడటం ఇది రెండోసారి. కశ్మీర్‌ సుంజ్వాన్ ప్రాంతంలో ఆర్మీ క్యాంప్‌పై జరిగిన ఉగ్రదాడిలో ఓ సైనికుడు, ఆయన కుమార్తె గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున 4.55 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు జమ్మూ ఐజీపీ ఎస్డీ సింగ్ జమ్వాల్ తెలిపారు. తీవ్రవాదుల దాడిలో గాయపడిన జవాను పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల సంఖ్యపై ఎలాంటి సమాచారం లేదని ఆయన ప్రకటించారు. సైనిక నివాసాల సమీపంలోని సంత్రి బంకర్ వద్ద అనుమానస్పద కదలికలను గుర్తించిన సైన్యం వెంటనే అప్రమత్తమై ఉగ్రవాదులపై కాల్పులు జరిపిందని ఐజీపీ తెలియజేశారు.
Samayam Telugu terrorists attack army camp in jks sunjwan
ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి.. ఇద్దరికి తీవ్రగాయాలు




ఈ ఘటనలో హవాల్దార్‌తోపాటు ఆయన కుమార్తె కూడా గాయపడినట్లు ఆయన తెలిపారు. సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గత శనివారం కూడా పుల్వామా జిల్లా ట్రాల్ సెక్టార్ సమీపంలోని బాటగండ్ గ్రామంలో సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్‌తో దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు మరో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. ఈ దాడి జరగడానికి ఒక్కరోజు ముందే పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ అధికారి సహా నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.