యాప్నగరం

కశ్మీర్‌లో ఉగ్రదాడి: ముగ్గురు సైనికులు మృతి

గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న కశ్మీర్‌లోని పరిస్థితులు ఉగ్రదాడితో ఒక్కసారి ఉలిక్కిపడేలా చేశాయి.

TNN 9 Jan 2017, 8:21 am
జమ్మూ కశ్మీర్‌లో తీవ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు. సోమవారం ఉదయం జమ్మూ, కశ్మీర్‌లోని అఖ్‌నూర్ జిల్లాలో భారీగా ఆయుధాలు ధరించిన తీవ్రవాదులు జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్‌ క్యాంపుపై దాడి చేశారు. ఈ ఉగ్రదాడిలో ముగ్గురు సైనికులు మరణించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన జీఆర్‌ఈఎఫ్‌ క్యాంప్‌పై ముష్కరులు దాడికి తెగబడినట్లు అధికారులు తెలిపారు.
Samayam Telugu terrorists attack in kashmir three jawans martyred
కశ్మీర్‌లో ఉగ్రదాడి: ముగ్గురు సైనికులు మృతి


గత కొద్ది రోజులుగా లోయలో ప్రశాంతంగా ఉన్నా ఈ దాడితో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్న సైనికులు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సరిహద్దుల్లోని మిత్రదేశాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కృషి చేస్తోంది. నోట్ల రద్దు తర్వాత కశ్మీర్‌లో ఉగ్రమూకల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినట్లు ఇటీవలే కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించిన విషయం విదితమే. కరెన్సీ రద్దుతో తీవ్రవాదులకు నిధులు సరఫరా అగిపోవడంతో అల్లర్లకు బ్రేక్ పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.