ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. 270 స్థానాలున్న మున్సిపలిటీల్లో తూర్పు, ఉత్తరం, దక్షిణ ఢిల్లీల కార్పోరేషన్లున్నాయి. వీటి ఫలితాలు ఏప్రిల్ 26న వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలు, స్వతంత్రులు మొత్తం 2,537 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా కోటి ముప్పై లక్షల మంది ఓటర్లున్నారు. 13,138 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతోంది.
డెంగ్యూ రోగాలు రాకుండా, చికున్ గున్యాకు దూరంగా ఉండాలంటే తమకు ఓటేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లను కోరారు. ఓటు వేసిన అనంతరం కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్ కు పరీక్షలాంటివి. తన పాలనకు ఇవి రెఫరెండం లాంటివి. ఈ మధ్య కాలంలో ఆప్ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బీజేపీలోకి వెళ్లిపోతుండట, కేజ్రీవాల్ పాలనపై విమర్శలు వస్తుండటంతో దీన్ని క్యాష్ చేసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
డెంగ్యూ రోగాలు రాకుండా, చికున్ గున్యాకు దూరంగా ఉండాలంటే తమకు ఓటేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లను కోరారు. ఓటు వేసిన అనంతరం కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్ కు పరీక్షలాంటివి. తన పాలనకు ఇవి రెఫరెండం లాంటివి. ఈ మధ్య కాలంలో ఆప్ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బీజేపీలోకి వెళ్లిపోతుండట, కేజ్రీవాల్ పాలనపై విమర్శలు వస్తుండటంతో దీన్ని క్యాష్ చేసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.