ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్మహల్ ఒకటి. షాజహాన్, ముంతాజ్ బేగంల ప్రేమకు ఇది చిహ్నం. మొఘల్ల కాలం నాటి ఈ కట్టడం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎంతో మంది సెలబ్రిటీలు ఈ కట్టడం ముందు సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ఈ పాలరాతి కట్టడాన్ని సందర్శించాడు. యమునా నది ఒడ్డున ఉన్న ఈ అద్భుత కట్టడాన్ని 1632లో షాజహాన్ నిర్మించాడు. ఇందులోనే అతడి ఇష్ట సఖి ముంతాజ్ బేగం సమాధి ఉంది.
ఈ అద్భుత కట్టడం గురించి చాలా కాలంగా వివాదాలు ఉన్నాయి. ఇది శివాలయం అని ఇటీవల కొందరు బీజేపీ నేతలు వాదించిన సంగతి తెలిసిందే. తర్వాత అధిష్టానం జోక్యం చేసుకోవడం, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సందర్శించడంతో.. ఈ వివాదం కాస్త మరుగున పడింది. కానీ ఈ కట్టడం మొత్తాన్ని వీక్షించడానికి పర్యాటకులకు అవకాశం లేదు. దీని బేస్మెంట్ను ఎప్పుడూ సాధారణ ప్రజలు చూడలేదట. దీని పునాదిలోనే ముంతాజ్ మహల్ సమాధి ఉంది. పైన కనిపించేది దాని ప్రతిరూపం.
పునాదిలో ఉన్న ద్వారాన్ని మూసివేశారు. ఈ ద్వారం మూసివేతకు కారణం ఏంటి..? ఇందులో ఉన్న మిస్టరీ ఏంటనేది విషయమై యూట్యూబ్లో ఓ వీడియో ఉంది. అదేంటో ఆసక్తి మేరకు మాత్రమే చూడండి. రాజకీయాలు మనకు అనవసరం. ఈ ఆర్టికల్ ఏ వర్గం వాళ్లనో నొప్పించడానికి కాదు. చరిత్ర మిగిల్చిన చిక్కుముళ్లను విప్పే ప్రయత్నం మాత్రమే.
బ్లాగర్: ఇషితా శర్మ
ఈ అద్భుత కట్టడం గురించి చాలా కాలంగా వివాదాలు ఉన్నాయి. ఇది శివాలయం అని ఇటీవల కొందరు బీజేపీ నేతలు వాదించిన సంగతి తెలిసిందే. తర్వాత అధిష్టానం జోక్యం చేసుకోవడం, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సందర్శించడంతో.. ఈ వివాదం కాస్త మరుగున పడింది. కానీ ఈ కట్టడం మొత్తాన్ని వీక్షించడానికి పర్యాటకులకు అవకాశం లేదు. దీని బేస్మెంట్ను ఎప్పుడూ సాధారణ ప్రజలు చూడలేదట. దీని పునాదిలోనే ముంతాజ్ మహల్ సమాధి ఉంది. పైన కనిపించేది దాని ప్రతిరూపం.
పునాదిలో ఉన్న ద్వారాన్ని మూసివేశారు. ఈ ద్వారం మూసివేతకు కారణం ఏంటి..? ఇందులో ఉన్న మిస్టరీ ఏంటనేది విషయమై యూట్యూబ్లో ఓ వీడియో ఉంది. అదేంటో ఆసక్తి మేరకు మాత్రమే చూడండి. రాజకీయాలు మనకు అనవసరం. ఈ ఆర్టికల్ ఏ వర్గం వాళ్లనో నొప్పించడానికి కాదు. చరిత్ర మిగిల్చిన చిక్కుముళ్లను విప్పే ప్రయత్నం మాత్రమే.
బ్లాగర్: ఇషితా శర్మ