యాప్నగరం

అసెంబ్లీలో నా బలం నిరూపించుకుంటా

జయలలిత మృతిపై అనుమానాలున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం అన్నారు. తనను గద్దె దించేందుకు

Samayam Telugu 8 Feb 2017, 11:22 am
జయలలిత మృతిపై అనుమానాలున్నట్లు తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం అన్నారు. తనను గద్దె దించేందుకు శశికళ కుట్ర చేశారని నిన్న తిరుగుబావుట ఎగురవేసిన ఓపీఎస్..బుధవారం మీడిమాతో మాట్లాడారు.
Samayam Telugu there have been doubts about former cm jayalalithaas death says ops
అసెంబ్లీలో నా బలం నిరూపించుకుంటా


‘‘జయలలిత మృతిపై అనేక అనుమానాలున్నాయి. అనుమానాల నిగ్గు తేల్చేందుకు విచారణ కటిమీని ఏర్పాటు చేస్తాం. విచారణ అనంతరం ఆ కమిటీ హైకోర్టుకు నివేదిక సమర్పిస్తుంది. ఆ తర్వాత దాన్ని ప్రజలకు వివరిస్తాం’’ అని పన్నీర్ సెల్వం చెప్పారు.

అవసరమైతే తన రాజీనామాను వెనక్కి తీసుకుంటానని స్పష్టం చేసిన ఓపీఎస్...అమ్మ అడుగుజాడల్లో నడుస్తానని అన్నారు. ‘‘నేనెప్పుడూ పార్టీని మోసం చేయలేదు’’ అని పేర్కొన్నారు.

తన వెనుక బీజేపీ సహా ఇతర పార్టీలున్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఓపీఎస్ కొట్టిపారేశారు.

‘‘అన్నాడీఎంకేను రక్షించాల్సిన బాధ్యత నాపై ఉంది. అమ్మను నన్ను కోశాధికారిగా నియమించారు. నన్ను తొలగించే అధికారం ఎవ్వరికీ లేదు. అమ్మ, ఎంజీఆర్ అడుగుజాడల్లో నడుస్తా’’ అని ఆయన స్పష్టం చేశారు.

శశికళ అన్నాడీఎంకే తాత్కాలక ప్రధాన కార్యదర్శేనని చెప్పిన ఓపీఎస్..గవర్నర్ చెన్నై రాగానే...ఆయన్ను కలుస్తామని పేర్కొన్నారు. అవకాశమిస్తే సభలో నా బలం నిరూపించుకుంటానని తెలిపారు. జయ మేనకోడలు దీప జయకుమార్ గౌరవిస్తానని, ఆమె మద్దతు కోరతానని చెప్పారు.

కాగా, ఓపీఎస్ కు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు అండగా నిలిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.