The Kerala Story: ది కేరళ స్టోరీ... దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమాపైనే చర్చ జరుగుతోంది. సినిమా కాస్త రాజకీయం రంగు పులుముకుని... సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కింది. ఓ మహిళను మతం మారేలా ప్రోత్సహించి తర్వాత ఐసిస్ ఉగ్రసంస్థలో చేర్పించిన ఉదంతంపై ఈ సినిమాను రూపొందించారు. అయితే అచ్చం ఇదే విధంగా ఓ మహిళను ఉగ్రవాదం వైపు మళ్లించారు. పేరు, మతం మార్చి ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. నేషనల్ ఇన్వెస్టింగ్ ఏజెన్స్ - NIA గాలింపులో భాగంగా ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఆమెను విచారించగా.. అసలు విషయం బయటపడింది. అయితే ఆమె అరెస్ట్ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఆమె వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుందని.. అప్పటి నుంచి తాము దూరంగా ఉన్నామని.. ఆమెకు గానీ ఆమె కుటుంబానికి తమకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఒక పేపర్ ప్రకటనను కూడా ఇచ్చారు. ఎలా ప్రారంభమైంది
యువతులు, మహిళలను ట్రాప్ చేసి మతం మార్చి ఐసిస్ ఉగ్రసంస్థలోకి నియమించుకుంటున్నారన్న వార్తలతో ఎన్ఐఏ అధికారులు జరిపిన సోదాల్లో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. గతేడాది కర్ణాటకలో జరిపిన తనిఖీల్లో ఓ మహిళను అరెస్ట్ చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని కొడగు గ్రామానికి చెందిన దీప్తి మార్లను అదుపులోకి తీసుకున్నారు. బీడీఎస్ చదువుతున్న దీప్తిని అనాస్ అబ్దుల్ రహమాన్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మతం మార్పించి.. దీప్తి పేరును మరియంగా మార్చినట్లు గుర్తించారు. మాజీ కాంగ్రెస్ నేత, 3 సార్లు ఎమ్మెల్యే బీఎం ఇదినబ్బ.. మనవడు అనాస్ అని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. తర్వాత ఆమె ఐసిస్తో సంబంధాలు పెట్టుకుందని.. స్థానికులను ఐసిస్ ఉగ్రసంస్థలోకి చేరేలా ప్రోత్సహించిందని చెప్పారు.
సంబంధం లేదన్న కుటుంబం
అయితే దీప్తి అలియాస్ మరియం అరెస్ట్ విషయం తెలిసి ఆమె కుటుంబసభ్యులు స్పందించారు. ఆమెతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు. దీప్తి పెళ్లి చేసుకుని వెళ్లిపోయినప్పటి నుంచి ఎలాంటి రాకపోకలు గానీ.. ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు లేవని తెలిపారు. దీప్తి తన ఇష్టం తోనే మతం మారిందని వెల్లడించారు. ఆమె, ఆమె భర్త, పిల్లలకు గానీ తమ ఆస్తిలో ఎలాంటి వాటా ఉండదని తేల్చిచెప్పారు. ఆమె చేసే పనులు, నేరాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
యువతులు, మహిళలను ట్రాప్ చేసి మతం మార్చి ఐసిస్ ఉగ్రసంస్థలోకి నియమించుకుంటున్నారన్న వార్తలతో ఎన్ఐఏ అధికారులు జరిపిన సోదాల్లో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. గతేడాది కర్ణాటకలో జరిపిన తనిఖీల్లో ఓ మహిళను అరెస్ట్ చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని కొడగు గ్రామానికి చెందిన దీప్తి మార్లను అదుపులోకి తీసుకున్నారు. బీడీఎస్ చదువుతున్న దీప్తిని అనాస్ అబ్దుల్ రహమాన్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మతం మార్పించి.. దీప్తి పేరును మరియంగా మార్చినట్లు గుర్తించారు. మాజీ కాంగ్రెస్ నేత, 3 సార్లు ఎమ్మెల్యే బీఎం ఇదినబ్బ.. మనవడు అనాస్ అని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. తర్వాత ఆమె ఐసిస్తో సంబంధాలు పెట్టుకుందని.. స్థానికులను ఐసిస్ ఉగ్రసంస్థలోకి చేరేలా ప్రోత్సహించిందని చెప్పారు.
సంబంధం లేదన్న కుటుంబం
అయితే దీప్తి అలియాస్ మరియం అరెస్ట్ విషయం తెలిసి ఆమె కుటుంబసభ్యులు స్పందించారు. ఆమెతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు. దీప్తి పెళ్లి చేసుకుని వెళ్లిపోయినప్పటి నుంచి ఎలాంటి రాకపోకలు గానీ.. ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు లేవని తెలిపారు. దీప్తి తన ఇష్టం తోనే మతం మారిందని వెల్లడించారు. ఆమె, ఆమె భర్త, పిల్లలకు గానీ తమ ఆస్తిలో ఎలాంటి వాటా ఉండదని తేల్చిచెప్పారు. ఆమె చేసే పనులు, నేరాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.