యాప్నగరం

ద్వేషంలేని చోటు ఇది.. ‘కైలాసం’ నుంచి రాహుల్ ట్వీట్

కైలాస యాత్రలో ఉన్న రాహుల్.. మానస సరోవరం అందాలకు పులకించిపోయారు. ఆ ఫొటోలను ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నారు.

Samayam Telugu 5 Sep 2018, 7:06 pm
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కైలాశ యాత్రలో ఉన్నారు. 12 రోజుల యాత్రలో భాగంగా ఆయన బుధవారం మానస సరోవరం చేరుకున్నారు. సుదూరంలో మంచు దుప్పటి పరుచుకున్న హిమగిరులు.. ప్రశాంతమైన అలలు, చల్ల గాలులతో ఆహ్లాదకరంగా ఉండే మానసరోవరం సరస్సు చూసి రాహుల్ పులకించిపోయారు.
Samayam Telugu Untitled1aa


ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ద్వారా మానస సరోవరం ఫొటోలను పంచుకున్నారు. ‘‘మానస సరోవరం సరస్సులోని నీటి అలలు చాలా సున్నితంగా, ప్రశాంతంగా, నిశబ్దంగా ఉన్నాయి. అవి అన్నీ ఇస్తాయి, కానీ, ఏవీ కోల్పోవు. ఎవరైనా సరే ఈ నీటిని తాగొచ్చు. ఇక్కడ ఎలాంటి ద్వేషం లేదు. అందుకే, మన దేశంలో ఈ నీటిని భక్తితో కొలుస్తాము’’ అని ట్వీట్ చేశారు. యాత్రలో భాగంగా రాహుల్ కైలాసం చుట్టూ సుమారు 60 కిమీలు ట్రెక్కింగ్ చేయనున్నారు.
రాహుల్ ట్వీట్:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.