యాప్నగరం

సంచలనం.. రూ.6 వేల కోట్లను అప్పగించిన గుజరాత్ వ్యాపారి?

గుజరాత్ వ్యాపారి ఒకరు రూ.6 వేల కోట్లను అప్పగించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ మొత్తానికి రూ.5400 కోట్ల మేర పన్నులు అదనం.

TNN 14 Nov 2016, 3:28 pm
నల్లధనంపై సమర శంఖం పూరిస్తూ... పెద్ద కరెన్సీ నోట్లపై నిషేధం విధిస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయానికి ఫలితం కనిపిస్తోంది. సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నా.. మోదీ నిర్ణయానికి మంచి ప్రతిఫలం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన బిల్డర్, వజ్రాల వ్యాపారి ఒకరు రూ.6 వేల కోట్లను అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ వార్తలు నిజమైతే అతడు అదనంగా దాదాపు రూ. 5400 కోట్లను పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. రూ.6 వేల కోట్లపై 30 శాతం పన్ను 1800 కోట్లు కాగా, కేంద్ర చెబుతున్నట్లు ఈ మొత్తానికి రెండు రెట్లు అపరాధ రుసుంగా చెల్లించాల్సి ఉంటుంది.
Samayam Telugu this businessman has surrendered rs 6000 crore in cash
సంచలనం.. రూ.6 వేల కోట్లను అప్పగించిన గుజరాత్ వ్యాపారి?


ఈ వ్యాపారి దేశంలోకెల్లా ధనవతుండైన బిల్డర్, వజ్రాల వ్యాపారి అని పోస్ట్‌కార్డ్.న్యూస్ అనే వెబ్‌సైట్ వెల్లడించింది. దాతృత్వ కార్యక్రమాల ద్వారా, తన ఉద్యోగులకు బహుమతులు ఇవ్వడం ద్వారా ఈ వ్యాపారి ఏటా వార్తల్లో నిలుస్తాడని కూడా ఆ వెబ్‌సైట్ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలికల విద్య కోసం రూ.200 కోట్లను విరాళంగా ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. దీపావళి సందర్భంగా తన ఉద్యోగులకు కార్లు, ఫ్లాట్లను బహుమతిగా ఇస్తున్నఆ వ్యాపారి ఎవరో ఇప్పటికైనా మీకు గుర్తొచ్చిందా?

అన్నట్టుూ గతంలో మోదీ వేసుకున్న ఖరీదైన సూట్‌ను ఈయనే కొనుగోలు చేశాడట. ఈ వివరాల ప్రకారం ఆయన లాల్ జీ భాయ్ పటేల్ అని పలువురు భావిస్తున్నారు. మరీ ఇంత పెద్ద మొత్తంలో కాకున్నా.. దేశవ్యాప్తంగానూ భారీగానే నగదు పట్టుబడుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే.. మరికొన్ని రోజుల్లో కలుగులో దాగిన మిగతా ‘నల్ల ఎలుకలు’ కూడా బయటకొచ్చి ప్రభుత్వం ముందు మోకరిల్లే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.