యాప్నగరం

కాల్వ గట్టున జ్యూస్ స్టాల్.. సూపర్ మ్యాన్‌గా మార్చేసింది

రోడ్డు పక్కన.. కాల్వ గట్టునే పళ్ల రసాలు అమ్ముకుని జీవించే ఓ యువకుడు దేశీ సూపర్ మ్యాన్‌గా మారాడు.

TNN 23 Jun 2018, 11:10 am
రోడ్డు పక్కన పళ్ల రసాలు అమ్ముకుని జీవించే ఓ యువకుడు దేశీ సూపర్ మ్యాన్‌గా మారాడు. రకరకాల సమస్యల కారణంగా నిరాశ నిస్పృహలతో బలవనర్మణానికి సిద్ధపడుతున్న వారి ప్రాణాలను మనోజ్ కుమార్ సైనీ అనే యువకుడు కాపాడుతున్నాడు. ఏడాది కాలంలోనే ఇతడు తన ప్రాణాలను రిస్క్ చేసి మరీ ఏడుగుర్ని బతికించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ భోపా ప్రాంతంలోని గంగా నది కాలువ పక్కనే సైనీ (26) జ్యూస్ స్టాల్ నడుపుతున్నాడు.
Samayam Telugu up man


కాలువపై ఉన్న బ్రిడ్జి మీది నుంచి అనేక మంది బలవన్మరణానికి పాల్పడుతుండే వారు. దీంతో ముజఫర్ నగర్ పట్టణానికి 16 కి.మీ దూరంలో ఉన్న ఆ ప్రాంతం సూసైడ్ పాయింట్‌గా పేరొందింది. కాల్వ ఒడ్డునే జ్యూస్ పాయింట్ నడుపుతున్న సైనీ చూస్తుండగానే ఓరోజు 70 ఏళ్ల వయసున్న పెద్దాయన ఉన్న ఫళంగా నీళ్లలోకి దూకేశాడు.

తన కళ్లను తాను నమ్మలేకపోయిన సైనీ.. వెంటనే నీళ్లలోకి దూకి ఆ పెద్దాయనను కాపాడాడు. ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధ పడ్డాడని బంధువులు చెప్పారు. తన లైఫ్‌ను రిస్క్ చేసి మరీ పెద్దాయన ప్రాణాలను కాపాడిన సైనీకి కొంత నగదును రివార్డుగా అందజేశారు.

అప్పటి నుంచి తన కళ్ల ముందు ఎవరైనా నీళ్లలో దూకితే వెంటనే తాను కూడా దూకేసి చేపలా ఈదుతూ.. సైనీ వారి ప్రాణాలను కాపాడుతున్నాడని భోపా డీఎస్పీ రాజీవ్ కుమార్ గౌతమ్ తెలిపారు. అతడెంతో గొప్ప పని చేస్తున్నాడని, సాహస అవార్డుల కోసం సైనీ పేరును రికమెండ్ చేస్తామని ఆయన చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.