యాప్నగరం

యుమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం.. ఎయిమ్స్ వైద్యులు మృతి

ఉత్తర్‌ప్రదేశ్ మథుర సమీపంలోని యమున ఎక్స్‌ప్రెస్‌వే మీద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎయిమ్స్-ఢిల్లీకి చెందిన ముగ్గురు వైద్యులు అక్కడిక్కడే మృతి చెందారు.

TNN 18 Mar 2018, 10:41 am
ఉత్తర్‌ప్రదేశ్ మథుర సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే మీద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎయిమ్స్-ఢిల్లీకి చెందిన ముగ్గురు వైద్యులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వైద్యులు ప్రయాణిస్తోన్న వాహనాన్ని 88 మైలు రాయి వద్ద ఓ కంటెయినర్ ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకల కోసం ఢిల్లీ నుంచి ఇన్నోవాలో ఆగ్రాకు వెళుతుండగా ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన వారిని హర్షద్ వాంఖేడ్, యశ్‌ప్రీత్ కాత్పాల్, హెమ్‌బాల్‌గా గుర్తించినట్టు ఎయిమ్స్ వైద్యుల సంఘం అధ్యక్షుడు హర్షిత్ తెలిపారు. వీరి మృతదేహాలను మథురలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని ఎయిమ్స్ ట్రూమా కేర్ ‌సెంటర్‌కు తరలించినట్టు ఆయన తెలియజేశారు.
Samayam Telugu three aiims doctors killed in brutal accident on yamuna expressway near mathura
యుమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం.. ఎయిమ్స్ వైద్యులు మృతి


నొయిడా సమీపంలోనూ ఎక్స్‌ప్రెస్ వేపై మరో ప్రమాదం కూడా చోటుచేసుకుంది. బస్సు బోల్తాపడి ఇద్దరు మరణించగా, మరో 23 మంది గాయపడ్డారు. మార్చి 13 నొయిడాకు చెందిన అంబులెన్స్‌ను ఓ ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నొయిడా నుంచి వస్తున్న ఆగ్రాకు వస్తోన్న అంబులెన్స్‌ను స్టేషనరీ తీసుకెళ్తోన్న ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.