యాప్నగరం

జవాన్ల దుశ్చర్య: మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు!

దేశానికి రక్షణ కల్పించాల్సిన జవాన్లే.. మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇండో-టిబెటన్ సరిహద్దు దళం (ఐటీబీపీ) 29వ బెటాలియన్‌కు చెందిన ముగ్గురు జవాన్లు, జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణులైన ముగ్గురు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

Samayam Telugu 25 May 2018, 1:42 am
దేశానికి రక్షణ కల్పించాల్సిన జవాన్లే.. మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇండో-టిబెటన్ సరిహద్దు దళం (ఐటీబీపీ) 29వ బెటాలియన్‌కు చెందిన ముగ్గురు జవాన్లు, జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణులైన ముగ్గురు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. మంగళవారం (మే 22) విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ జవాన్లపై ఛత్తీస్‌ఘడ్‌లోని కొంగావ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. బుధవారం (మే 23) వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి పోలీసు కస్టడీకి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Samayam Telugu itbp


2013లోనూ ఇలాంటి ఘటనే ధర్మశాలలో జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై ఒక ఐటీబీపీ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.