యాప్నగరం

మోదీ సభకు వెళ్తున్న బస్సు బోల్తా, ముగ్గురు మృతి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యే ఓ కార్యక్రమానికి వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తా

TNN 15 May 2017, 3:05 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యే ఓ కార్యక్రమానికి వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 42 మంది గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని దిందోరీ జిల్లాలో సోమవారం మధ్యాహ్నాం ఈ ఘటన చోటుచేసుకుంది.
Samayam Telugu three killed 42 injured in bus accident in madhya pradesh
మోదీ సభకు వెళ్తున్న బస్సు బోల్తా, ముగ్గురు మృతి


అన్నోపూర్‌లోని అమర్‌కంతక్‌ ప్రాంతంలో నేటితో ముగియనున్న ‘నమామీ దేవి నర్మదే సేవా యాత్ర’కు మోదీ రానున్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న బస్సు బోల్తా పడింది. డ్రైవర్‌ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో దూసుకెళ్లి రోడ్డుపక్కనే బోల్తాపడినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా..రోడ్డు పక్కన నిలబడిన మరో ఇద్దరు వ్యక్తులు బస్సు కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇద్దరు కూడా ఇదే కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరినట్లు సమాచారం. గాయపడ్డ 42 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.