యాప్నగరం

టపాసుల లారీలో పేలుడు.. ముగ్గురు సజీవదహనం

దీపావళి కోసం భారీగా టపాసుల్ని తీసుకొచ్చిన వ్యాపారి.. లారీలో నుంచి బాక్సులు దించుతుండగా పేలుడు.

Samayam Telugu 12 Sep 2018, 4:13 pm
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. చెన్నైలోని ఈరోడ్‌లో టపాసుల లారీలో పేలుడు సంభవించింది. ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనంకాగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈరోడ్‌లోని శాస్త్రి నగర్‌కు చెందిన కార్తీక్ అనే వ్యక్తి దీపావళి కోసం శివకాశీలో టపాసులు కొనుగోలు చేశాడు. వాటిని ట్రాన్స్‌పోర్ట్ పార్శిల్ ద్వారా చెన్నైకి తరలించారు. ఆ పార్శిల్ బుధవారం ఉదయం నగరానికి చేరగా.. కార్తీక్ పార్శిల్ సర్వీస్ సెంటర్‌ నుంచి రెండు మినీ ట్రకుల్లో లోడ్ చేసి ఇంటికి తరలించాడు.
Samayam Telugu Fire


మినీ ట్రక్కుల్లో నుంచి కార్తీక్ తన ఇంటి దగ్గర ఆ బాక్సుల్ని దించుతుండగా ఏం జరిగిందో ఏమో టపాసులు ఒక్కసారిగా పేలాయి. నిమిషాల వ్యవధిలోనే దట్టమైన పొగ, మంటలు కూడా వ్యాపించాయి. భారీ శబ్ధం రావడంతో చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న జనాలంతా భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలంలో ఓ 10 నిమిషాలు ఏం జరిగిందో కూడా అర్థంకాని పరిస్థితి. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

టపాసుల పేలుడు దెబ్బకు కార్తీక్‌తో పాటూ మరో ఇద్దరు సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగుర్ని ఆస్పత్రులకు తరలించారు. పేలుడుతో దాదాపు 5 ఇళ్లు ధ్వంసంకాగా.. పక్కనే ఉన్న ఓ అపార్ట్‌మెంట్ కూడా కూడా దెబ్బతింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటల్ని ఆర్పేశారు. మంటలు అదుపులోకి వచ్చేందుకు దాదాపు మూడు గంటల సమయం పట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.