యాప్నగరం

కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు లస్కరే తోయిబా ఉగ్రవాదులను సైన్యం గురువారం మట్టుబెట్టింది.

TNN 8 Dec 2016, 7:28 pm
జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు లస్కరే తోయిబా ఉగ్రవాదులను సైన్యం గురువారం మట్టుబెట్టింది. దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా అర్వాణి గ్రామంలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య సుమారు ఆరు గంటలపాటు సాగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గరు ముష్కరులు హతమైనట్లు సైన్యం వెల్లడించింది. మరోవైపు ఎన్‌కౌంటర్ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాకుండా ఉండటానికి దక్షిణ కశ్మీర్‌లో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు.
Samayam Telugu three lashkar militants killed in kashmir gunfight
కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం


చనిపోయిన ముగ్గరు ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్‌కు చెందినవారేనని పోలీసులు నిర్ధారించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. మరోవైపు ఉగ్రవాదులను హతమార్చిన విషయం బయటికి రావడంతో ఎన్‌కౌంటర్ జరిగిన అర్వాణి గ్రామానికి ర్యాలీగా రావడానికి కొంతమంది ఆందోళనకారులు ప్రయత్నించారు. వారిని భద్రతా దళాలు అడ్డుకున్నారు. దీంతో సైనికులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.

అయితే చనిపోయిన ఉగ్రవాదుల్లో లష్కరే తోయిబా కమాండర్ అబు దుజానా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కరడుగట్టిన ఉగ్రవాదుల్లో ఒకడైన దుజానా ఎన్‌కౌంటర్‌పై సైన్యం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.