యాప్నగరం

గుడ్లు విసిరితే ఆమ్లెట్ చేస్తా: మంత్రి

తనపై గుడ్లు విసిరితే భయపడేది లేదని వాటితో ఆమ్లెట్ చేసుకొని తింటానని కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో

Samayam Telugu 15 Jun 2017, 4:39 pm
తనపై గుడ్లు విసిరితే భయపడేది లేదని వాటితో ఆమ్లెట్ చేసుకొని తింటానని కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో అన్నారు. బాబుల్ గురువారం ఒడిషాలో పర్యటించారు. బాబుల్ పర్యటనను నిరసిస్తూ బీజు జనతా దళ్, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన కాన్వాయ్ పై గుడ్లు విసిరారు. దీంతో ఆయన సీరియస్ అయ్యారు.
Samayam Telugu throw eggs i will make omelet says babul supriyo
గుడ్లు విసిరితే ఆమ్లెట్ చేస్తా: మంత్రి


‘బీజేడీ, కాంగ్రెస్ లకు లేశమాత్రమైనా భయపడేది లేదు. నాపై గుడ్లు విసురుతున్నట్లు తెలిసింది. నేను మాంసాహారిని. బీజేడీ, కాంగ్రెస్ కార్యకర్తలు గుడ్లు విసిరితే వాటితో ఆమ్లెట్ చేసుకొని తింటా’ అని స్పష్టం చేశారు.

మధ్యప్రదేశ్ మందసౌర్ లో రైతులు చనిపోవడంతో పాటు ఒడిషా మహానది జల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో బాబుల్ పర్యటనను బీజేడీ, కాంగ్రెస్ లు వ్యతిరేకించాయి.

కేంద్రప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు చేరకుండా బీజేడీ, కాంగ్రెస్ లు అడ్డుకుంటున్నాయని బాబుల్ ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.