యాప్నగరం

మనిషి ప్రాణం తీసిన పులి.. రాజస్థాన్‌లోని అభయారణ్యంలో దారుణం

రాజస్థాన్‌లోని రణతంబోర్ టైగర్ రిజర్వు ఫారెస్టులో పులి హల్‌ చేసింది. సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తిని నోట కరుచుకుని వెళ్లి చంపేసింది.

Samayam Telugu 8 Jan 2021, 10:33 am
అడవులు క్రమంగా అంతరించిపోతుండటంతో జంతువులు జనావాసాల్లోకి వచ్చేస్తున్న ఘటనలు చూస్తేనే ఉన్నాం. ముఖ్యంగా చిరుతలు, పులులు గ్రామాల్లోకి ప్రవేశించి మనుషుల ప్రాణాలు తీసేస్తున్నాయి. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ జిల్లాలోని రణతంబోర్ టైగర్ రిజర్వు ఫారెస్టులో ఓ పులి హల్‌చల్ చేసింది. ఓ వ్యక్తిపై దాడి చేసి ప్రాణాలు తీసేసింది.
Samayam Telugu Tiger


Also Read: కూతురిని ప్రేమించాడని కాటికి పంపారు... తమిళనాడులో యువకుడి దారుణ హత్య

పులి దాడిలో మరణించిన వ్యక్తిని రణతంబోర్ టైగర్ రిజర్వు పక్కనున్న కనెడి గ్రామానికి చెందిన పప్పు గుర్జర్(40)గా గుర్తించారు. కనెడి గ్రామశివార్లలో పులి దాడి చేసి ఓ వ్యక్తిని చంపిందని తమకు సమాచారం అందినట్లు టైగర్ రిజర్వు ఫీల్డు డైరెక్టరు టికం చంద్ వర్మ చెప్పారు. మనిషిని చంపిన పులిని అటవీశాఖ అధికారులు ఇంకా గుర్తించలేదు. పులి దాడి చేసిన ప్రాంతాల్లోని గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా సంచరించొద్దని హెచ్చరిస్తున్నారు. పులి దాడిలో మరణించిన పప్పు గుర్జర్ కుటుంబానికి రూ.4లక్షల పరిహారం ఇస్తామని అటవీశాఖ డైరెక్టర్ వర్మ ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.