యాప్నగరం

#MeToo: ‘ఆ ప్రొఫెసర్ ఓ కీచకుడు’

తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని ప్రముఖ విద్యాసంస్థ పూర్వ విద్యార్థిని చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

Samayam Telugu 28 Oct 2018, 6:40 pm
దేశంలో లైంగి వేధింపుల బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి #MeToo ఉద్యమంలో తమ గళం విప్పుతున్నారు. అమ్మాయిలను వేధించే వాళ్లకు శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేసి కోర్టుకీడుస్తున్నారు. ఈ క్రమంలో తొలిసారిగా ఓ విద్యాసంస్థలో వేధింపుల ఘటన బహిర్గతమైంది. సోషల్ మీడియా వేదికగా కాలేజీ పూర్వ విద్యార్థిని ప్రొఫెసర్ కీచక చర్యలను అందరికీ తెలిసేలా చేసింది.
Samayam Telugu MeToo


దశాబ్దం కిందట తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని ముంబైలోని టాటా ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) పూర్వ విద్యార్థిని ప్రీతి క్రిష్ణన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. 2004-2006 మధ్య కాలంలో తాను ఆ విద్యాసంస్థలో ఎంఏ చదివానని తెలిపింది. రీసెర్చ్ కోసం సాయం చేస్తున్న నెపంతో ఓ ప్రొఫెసర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఆ సమయంలో ఆమెకు ఇన్‌ఛార్జ్, గైడ్‌గా పి విజయ్‌కుమార్ అనే వ్యక్తి పనిచేశారు.
చదవండి: MeToo సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి

‘కాలేజీలో చేరిన కొన్నిరోజులు ఏ ఇబ్బంది లేదు. అయితే కాలేజీ చివరి ఏడాది విజయ్‌కుమార్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. రాత్రిపూట తన అపార్ట్‌మెంట్‌కు రావాలంటే ఓసారి వెళ్లాను. ఆ రాత్రి పదే పదే ముద్దు పెట్టుకునేందుకు యత్నించాడు. ఆ తర్వాత పలుమార్లు ఆయన ఆఫీసులోనూ అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురిచేశాడని’ తన ఫేస్‌బుక్ పోస్టులో రాసుకొచ్చింది. టీఐఎస్ఎస్ యాజమాన్యం దీనిపై స్పందించింది. విజయ్‌కుమార్ నవంబర్ 14వరకు సెలవులో ఉన్నారని, వచ్చాక విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.