యాప్నగరం

Cattle smuggling case: మమతా బెనర్జీకి మరో దెబ్బ... టీఎంసీ సీనియ‌ర్ నేత అరెస్ట్‌

పాత కుంభకోణాలు (Cattle smuggling case) తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కొంప ముంచుతున్నాయి. ఇప్పటికే టీచర్ రిక్రూట్‌మెం స్కామ్‌లో ఓ మాజీ మంత్రి అరెస్ట్ కాగా.. తాజాగా పశువులు అక్రమ రవాణా కేసులో మరో టీఎంసీ సీనియర్ నాయకులు అరెస్ట్ అయ్యారు. సీబీఐ అధికారులు గురువారం ఆయన ఇంటిక వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. విచారణకు సహకరించడం లేదని పేర్కొన్నారు. అయితే ఆయన బీర్భం జిల్లాలో టీఎంసీ బలోపేతానికి చాలా కష్టపడ్డారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 11 Aug 2022, 5:11 pm

ప్రధానాంశాలు:

  • పశువుల అక్రమ రవాణా కేసులో సీబీఐ విచారణ
  • విచారణకు సహకరించడం లేదని అనుబ్రతా మోండల్ అరెస్ట్
  • గతంలోనూ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మోండల్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Anubrata Mondal Arrested
Cattle smuggling case: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నెత్తిన మరో పిడుగు పడింది. ఇటీవలె దీదీ కేబినెట్‌లోని మంత్రి పార్థ ఛటర్జీని అరెస్ట్ అయ్యారు. అది ఇంకా సమసిపోక ముందే.. మరో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని అరెస్ట్ చేశారు. పశువుల అక్రమ రవాణా కేసులో టీఎంసీ నాయకుడు అనుబ్రతా మోండల్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తృణమూల్‌కి చెందిన బీర్‌భూమ్ జిల్లా చీఫ్‌ అనుబ్రతా మోండల్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులతో కలసి, సీబీఐ అధికారులు అతని ఇంటికి వెళ్లారు. అయితే అతను విచారణకు హాజరు కావడానికి కనీసం రెండు వారాలు కావాలని అతని న్యాయవాదులు తెలిపారు.
అంతేకాదు అధికారులు లోపలకు రాకుండా ఉండేందుకు ఇంటి తలుపులకు తాళం వేసేసినట్టు సంబంధిత వర్గాల తెలిపాయి. దాంతో కేసు విచారణకు సహకరించడం లేదంటూ సీబీఐ చివరకు అరెస్ట్ చేశారు. విచారణకు హాజరు కావాలని మోండల్‌కు సీబీఐ ఇప్పటికే పదిసార్లు సమన్లు జారీ చేసింది. అయితే అనారోగ్య కారణాలను చూపుతూ విచారణకు వెళ్లలేదు. అయితే మోండ‌ల్ (61)కు బెంగాల్ సీఎం మ‌మ‌తా బెనర్జీకి అత్యంత స‌న్నిహితుడిగా పేర్కొంది.

మోండల్ బాడిగార్డ్ అరెస్ట్...
ఈ కేసులో సీబీఐ నాలుగు చార్జిషీట్లను దాఖలు చేసి 11 మందిని నిందితులుగా పేర్కొంది. ఈ కేసులో మోండల్ బాడిగార్డ్ సైగల్ హొస్సేన్‌ను అరెస్ట్ చేశారు. పశువుల స్మగ్లర్లు, మోండల్ మధ్య డబ్బును తరలించడంలో సైగల్ కీలక పాత్ర పోషించాడని సీబీఐ ఆరోపించింది. ఆరోపించింది. సైగల్ హొస్సేన్‌ కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టు సీబీఐ వెల్లడించింది.

బీర్భంలో పార్టీ బలోపేతానికి కృషి...
అయితే బీర్భంలో టీఎంసీ పార్టీ బలోపేతానికి మోండల్ చాలా కృషి చేశారు. ప్ర‌స్తుతం ఆ జిల్లాలో 11 సీట్ల‌కు గాను 10 స్థానాలను తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మోండల్ టీఎంసీ జాతీయ వ‌ర్కింగ్ క‌మిటీలో ఉన్నారు. అయితే మోండల్‌పై చాలా ఆరోపణలున్నాయి. గతంలో పోలీసుల‌పై బాంబులు విస‌రాలంటూ టీఎంసీ కార్య‌క‌ర్త‌ల‌ను ప్రోత్స‌హించ‌డంతో పాటు ప‌లుమార్లు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. 30 ఏళ్లకుపైగా రాజకీయాల్లో మోండల్ ఎప్పుడూ ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. గ‌తంలో బెంగాల్‌లో ఎన్నిక‌ల అనంత‌ర హింస‌పై ప్ర‌శ్నించేందుకు మోండల్‌కు సీబీఐ స‌మ‌న్లు జారీ చేసింది. అయితే మోండల్ బీర్భూమ్‌లో చాలామంది జీవితాలను నాశనం చేశారని, ప్రజలను హింసించారని బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ ఆరోపించారు. సీబీఐ అతనితో కఠినంగా ప్రవర్తించాలని సూచించారు.

మోండల్ అరెస్ట్.. సీఎం మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ పడినట్టైంది. ఇటీవలె టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో తృణమూల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈడీ జరిపిన దాడిలో అర్పితా ముఖర్జీ ఇంట్లో రూ.50కోట్లకుపైగా నగదు లభ్యమైంది. ఆ డబ్బు పార్థ ఛటర్జీకి సంబంధించినదని ఆమె చెప్పడంతో.. ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో సీఎం మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అనేక విమర్శలకు గురైంది.

Read also:: ముస్లిం అమ్మాయిని ప్రేమించిన హిందూ అబ్బాయి... గ్రామంలో ఘర్షణలు, ఇద్దరు మృతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.