యాప్నగరం

ఎమ్మెల్యేలు ఫర్ సేల్... ప్రతిపక్షం వాకౌట్

అప్రజ్వామికంగా ఎన్నికైన పళనిసామి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రతిపక్ష డీఎంకే సభ్యులు అసెంబ్లీలో

TNN 14 Jun 2017, 1:48 pm
అప్రజ్వామికంగా ఎన్నికైన పళనిసామి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రతిపక్ష డీఎంకే సభ్యులు అసెంబ్లీలో నిరసనకు దిగారు. ఈయేడాది ఫిబ్రవరి 18న విశ్వాస పరీక్ష సందర్భంగా పళనిసామి ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని డీఎంకే నేత స్టాలిన్ సభలో ఆరోపించారు. ఆయనకు బాసటగా మిగతా సభ్యులు ఆందోళన చేశారు.
Samayam Telugu tn assembly mlas for sale placards raised dmk leaders detained
ఎమ్మెల్యేలు ఫర్ సేల్... ప్రతిపక్షం వాకౌట్


‘అమ్మకానికి ఎమ్మెల్యేలు (ఎమ్మెల్యేస్ ఫర్ సేల్)’ అంటూ ప్లక్లార్డులు ప్రదర్శిస్తూ.. సభను స్తంభింపజేశారు. అయితే ‘నోటుకు ఓటు’ అంశం న్యాయస్థానంలో ఉన్నందున సభలో చర్చించలేమని స్పీకర్ పి.ధనపాల్ స్పష్టం చేశారు. అయినా ఈ అంశాన్ని సభలో చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించింది. దీంతో స్టాలిన్ ను సభ నుంచి బయటకు తీసుకెళ్లాలని స్పీకర్ మార్షల్స్ ను ఆదేశించారు. స్టాలిన్ సభలో నుంచి బయటకు రాగానే ఆయనకు మద్దతుగా డీఎంకే సభ్యులు సభను వాకౌట్ చేశారు.

అనంతరం అసెంబ్లీ భవనం ఎదుట ఆందోళన చేయగా.. వారిని పోలీసులు అరెస్టు చేశారు. నోటుకు ఓటు అంశాన్ని సభలో చర్చించాలని పట్టుబట్టినా స్పీకర్ అనుమతించలేదని, పళనిసామి ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు తమ పోరాటం ఆపబోమని స్టాలిన్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.