యాప్నగరం

నేనెవరికి చెప్పుకోవాలి: అసెంబ్లీ స్పీకర్

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. బల్లలు, కుర్చీలు ధ్వంసం చేశారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్ సీట్లో

Samayam Telugu 18 Feb 2017, 3:02 pm
తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. బల్లలు, కుర్చీలు ధ్వంసం చేశారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్ సీట్లో కూర్చొని నినాదాలు చేశారు. స్పీకర్ చొక్కా చించారు. ఆయనను అవమానించారు. నెట్టివేశారు. మహిళా ఎమ్మెల్యేలు సైతం బల్లల మీదకు ఎక్కి నానా హంగామా చేశారు. దీంతో ఆగ్రహంతో స్పీకరర్ ధనపాల్ అసెంబ్లీని మధ్యాహ్నం 3గంటల దాకా వాయిదా వేశారు.
Samayam Telugu tn assembly speaker man handled by dmk mlas
నేనెవరికి చెప్పుకోవాలి: అసెంబ్లీ స్పీకర్


సీఎం పళనిసామి ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు శనివారం స్పీకర్ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచారు.

సభ ప్రారంభమైన ఉదయం 11గంటల నుంచే అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఒక వైపు ఓ పన్నీరుసెల్వం వర్గం, మరోవైపు డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు రహస్య ఓటింగ్ కోసం స్పీకర్ ను పట్టుబట్టారు. అయితే స్పీకర్ మాత్రం రహస్య బ్యాలెట్ కు అనుమతి ఇవ్వలేదు. ఆరు బ్లాకుల్లో నిల్చొని తమ మద్దతు ప్రభుత్వానికి ఇస్తున్నారా లేదా చెప్పాలని స్పీకర్ ఎమ్మెల్యేలకు సూచించారు. దీంతో డీఎంకే సభ్యులు రెచ్చిపోయారు. స్పీకర్ ను కొట్టేంత పనిచేశారు.

సభ సజావుగా సాగకపోవడంతో స్పీకర్ సభను రెండు సార్లు వాయిదా వేశారు.
వాయిదాపడ్డ సభ మధ్యాహ్నం 1గంటలకు ప్రారంభమైంది. పలువురు సభ్యులు తమపై దాడి జరిగిందని ఆయనతో మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ధన్ పాల్ మాట్లాడుతూ ‘‘నా చొక్కా చించారు. నాపై దాడి యత్నం జరిగింది. నన్ను అవమానించారు. నేనెవరికి చెప్పుకోవాలి?’’ అంటూ వాపోయారు. స్పీకర్ ను మార్షల్స్ అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు.

డీఎంకే సభ్యులను సభ సస్పెండ్ చేశాక సభ వాయిదా పడింది. వాయిదా పడ్డ సభ మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభం కానుంది.

తమిళనాడు అసెంబ్లీలో చోటుచేసుకున్న సంఘటల పట్ల పలువురు రాజకీయ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ పై దాడికి పాల్పడటం, అవమానించడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని బీజేపీ నేత సుబ్రమణ్యంస్వామి అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.