యాప్నగరం

మోదీతో చర్చిస్తా, ఆందోళన విరమించండి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించి సమస్యలకు పరిష్కారం కోసం కృషి చేస్తానని గత 40 రోజులుగా

TNN 23 Apr 2017, 1:17 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించి సమస్యలకు పరిష్కారం కోసం కృషి చేస్తానని గత 40 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న తమిళనాడు రైతులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి హామీ ఇచ్చారు.
Samayam Telugu tn cm palanisamy meets protesting farmers at jantar mantar
మోదీతో చర్చిస్తా, ఆందోళన విరమించండి


ఆదివారం పళినిసామి రైతులను కలిశారు. వారి డిమాండ్లను విన్నారు.

కరువు రిలీఫ్ ఫండ్ రూ. 40వేల కోట్ల ప్యాకేజీతో పాటు రుణమాఫీ, కావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్లతో తమిళనాడు రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

రైతులను కలిసిన అనంతరం సాయంత్రం ప్రధాని మోదీని కలిసి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరతానని పళనిసామి వెల్లడించారు. ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన పళనిసామి రైతులను కలిశారు. రైతుల సమస్యలను ఇది వరకే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి వివరించారు.

తమిళనాడు రైతులు రూ.40వేల కోట్లు డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం మాత్రం కేవలం రూ.4వేలు మాత్రమే విడుదల చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.