యాప్నగరం

ఓట్లు జయకే వేశారు కానీ..వాళ్లకు కాదు: స్టాలిన్

తమిళనాడు సీఎం పదవిలో అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ కూర్చుంటారని

Samayam Telugu 5 Feb 2017, 3:15 pm
తమిళనాడు సీఎం పదవిలో అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ కూర్చుంటారని వస్తున్న వార్తలపై ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ స్పందించారు.
Samayam Telugu tn people voted jaya but not her family members nor any others says stalin
ఓట్లు జయకే వేశారు కానీ..వాళ్లకు కాదు: స్టాలిన్


‘‘ప్రజలు జయలలితను చూసి ఆమె ప్రభుత్వానికి ఓట్లేశారు తప్ప ఓ పన్నీరు సెల్వంను గానీ, జయ కుటుంబ సభ్యులను చూసి కానీ, ఇతర ఎవ్వరినీ చూసి కాదు’’ అని స్టాలిన్ అన్నారు.

అధికార అన్నాడీఎంకే పార్టీలో కొనసాగుతున్న పరిణామాలను డీఎంకే జాగ్రత్తగా గమనిస్తున్న....ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తమ విధానాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

అన్నాడీఎంకే పార్టీలోని అంతర్గత విబేధాలును తాము పట్టించుకోమని ఆయన అన్నారు.
స్టాలిన్ ఉదయం ఈ వ్యాఖ్యలు చేయగా...మధ్యాహ్ననికి తమిళనాడు రాజకీయాలు అనుహ్యంగా మారాయి. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శాసనసభ పక్షనేత శశికళను ఎన్నుకున్నారు. సీఎం పదవికి పన్నీరు సెల్వం రాజీనామా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.