‘భీమ్’ యాప్ వెనుకున్న కథేంటో తెలుసా?!
రానున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దళిత ఓటుబ్యాంకును ఆకర్శించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించిన భీమ్ యాప్
TNN 31 Dec 2016, 11:55 am
రానున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దళిత ఓటుబ్యాంకును ఆకర్శించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించిన భీమ్ యాప్ ను అస్త్రంగా వినియోగించనున్నారు. BHIM (Bharat interface form Money) మొబైల్ యాప్ ను క్యాష్ లెస్ సోసైటీ స్థాపనకు తోడ్పడుతుందని ఆయన అన్నారు.
దళితవర్గాలను తమవైపు తిప్పుకునేందుకు ఈ యాప్ కూడా తోడ్పతుందని బీజేపీ భావిస్తోంది.
యేడాది క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేములు ఆత్మహత్య, దేశవ్యాప్తంగా దళితులపై దాడులు కొనసాగుతుండటంతో అధికార బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. మోదీ పాలనలో దళితులు, మైనార్టీలకు రక్షణ లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి సహా, ఇతర పార్టీల నేతలు విరుచుకుపడ్డారు.
దళితులను బుజ్జగించేందుకు, తాము మీవైపే ఉన్నామని చెప్పేందుకు మోదీ ప్రయత్నాలు ప్రారంభించారు. అంబేద్కర్ లండన్ లో ఉన్నప్పుడు నివాసం ఉన్న గృహాన్ని మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అటు ఆరెస్సెస్ సైతం దళితుల ఉద్దరణపై మాట్లాడుతోంది. అంబేద్కర్ 125 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేంద్రం సన్నాహాలు ప్రారంభించింది.
ఒక వర్గం హిందువులు కలిసినప్పుడు జై శ్రీరామ్ అని సంబోధించుకుంటారు. వీరేగాక వివిధ సామాజిక వర్గాల ప్రజలు కూడా తమ తమ వర్గ దైవమో లేక కులంపేరుతో జై అని పలుకరించుకుంటారు. అలాగే దళితులు కూడా భీమ్ రావ్ అంబేద్కర్ ను స్మరించుకునేలా ‘జై భీమ్’ అని సంబోధించుకుంటారు. అంబేద్కర్ ను స్మరించుకునేలా ఉండేలా ఉండేందుకే మోదీ ప్రభుత్వం భీమ్ యాప్ ను రూపొందించింది.
అందుకే మోదీ సైతం...‘‘గూగుల్ లో భీమ్ గురించి సెర్చ్ చేస్తే మహాభారతంలోని భీమ్ (భీముడు)..బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్లు మాత్రమే వస్తారు. ఆర్బీఐ ఏర్పడింది కూడా అంబేద్కర్ ఆలోచనల నుంచే. దేశానికి అవసరమైన ఆర్థిక సంస్కరణలను ఆయన బోధించారు’ అని గుర్తుచేశారు.
లక్కీ గ్రహక్ యోజన, డిజిధన్ వ్యాపార్ యోజన పథకాలు పేద వర్గాలకు ఎంతో ఉపకరిస్తాయని మోదీ చెప్పారు.
దళితవర్గాలను తమవైపు తిప్పుకునేందుకు ఈ యాప్ కూడా తోడ్పతుందని బీజేపీ భావిస్తోంది.
యేడాది క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేములు ఆత్మహత్య, దేశవ్యాప్తంగా దళితులపై దాడులు కొనసాగుతుండటంతో అధికార బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. మోదీ పాలనలో దళితులు, మైనార్టీలకు రక్షణ లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి సహా, ఇతర పార్టీల నేతలు విరుచుకుపడ్డారు.
దళితులను బుజ్జగించేందుకు, తాము మీవైపే ఉన్నామని చెప్పేందుకు మోదీ ప్రయత్నాలు ప్రారంభించారు. అంబేద్కర్ లండన్ లో ఉన్నప్పుడు నివాసం ఉన్న గృహాన్ని మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అటు ఆరెస్సెస్ సైతం దళితుల ఉద్దరణపై మాట్లాడుతోంది. అంబేద్కర్ 125 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేంద్రం సన్నాహాలు ప్రారంభించింది.
ఒక వర్గం హిందువులు కలిసినప్పుడు జై శ్రీరామ్ అని సంబోధించుకుంటారు. వీరేగాక వివిధ సామాజిక వర్గాల ప్రజలు కూడా తమ తమ వర్గ దైవమో లేక కులంపేరుతో జై అని పలుకరించుకుంటారు. అలాగే దళితులు కూడా భీమ్ రావ్ అంబేద్కర్ ను స్మరించుకునేలా ‘జై భీమ్’ అని సంబోధించుకుంటారు. అంబేద్కర్ ను స్మరించుకునేలా ఉండేలా ఉండేందుకే మోదీ ప్రభుత్వం భీమ్ యాప్ ను రూపొందించింది.
అందుకే మోదీ సైతం...‘‘గూగుల్ లో భీమ్ గురించి సెర్చ్ చేస్తే మహాభారతంలోని భీమ్ (భీముడు)..బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్లు మాత్రమే వస్తారు. ఆర్బీఐ ఏర్పడింది కూడా అంబేద్కర్ ఆలోచనల నుంచే. దేశానికి అవసరమైన ఆర్థిక సంస్కరణలను ఆయన బోధించారు’ అని గుర్తుచేశారు.
లక్కీ గ్రహక్ యోజన, డిజిధన్ వ్యాపార్ యోజన పథకాలు పేద వర్గాలకు ఎంతో ఉపకరిస్తాయని మోదీ చెప్పారు.