ఎన్నికలప్పుడు తన గ్రామానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఓ యువకుడు పది కాదు.. వంద కాదు ఏకంగా 1,350 కిమీలు నడుస్తూ తన నిరసన వ్యక్తం చేశాడు. ఇంకా నడిచేవాడే.. కానీ, నిరంతరాయంగా నడవడం వల్ల ఆరోగ్యం దెబ్బ తిని ఆస్పత్రిపాలయ్యాడు. తన గ్రామం కోసం అంత దూరం చేసిన ఆ యువకుడి పేరు ముక్తికాంత్.
ఒడిశాలోని రూర్కెలా సమీపంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ముక్తికాంత్.. ఏప్రిల్ నెలలో పాదయాత్ర ప్రారంభించాడు. దాదాపు రెండున్నర నెలలుగా నడుస్తూ ఆగ్రాకు చేరిన అతను అనారోగ్యానికి గురికావడంతో అక్కడే ఓ ఆసుపత్రిలో చేరాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మా గ్రామానికి దగ్గర్లో ఉన్న రూర్కెలా ఉక్కు కర్మాగారం నుంచి విడుదలవుతున్న వ్యర్ధాల వల్ల గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురవ్వుతున్నారు. 2014 లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత 2015లో ప్రధాని మోడీ మా గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా మా రూర్కెలా ఇస్పాట్ జనరల్ హాస్పిటల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని, బ్రాహ్మణి వంతెనను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లవుతున్నా ఆ హామీ నెరవేర్చలేదు’’ అని తెలిపాడు.
సరైన వైద్యం లభించక తమ ఊరిలో నిత్యం ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారని, ఈ విషయాన్ని మోడీకే కాకుండా యావత్తు దేశానికి తెలిపేందుకే తాను ఈ పాదయాత్ర చేపట్టానని తెలిపాడు. నడుస్తూ ఢిల్లీ చేరుకుని ఆయనకు తమ గ్రామ సమస్యను గుర్తు చేస్తానని చెప్పాడు.
ఒడిశాలోని రూర్కెలా సమీపంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ముక్తికాంత్.. ఏప్రిల్ నెలలో పాదయాత్ర ప్రారంభించాడు. దాదాపు రెండున్నర నెలలుగా నడుస్తూ ఆగ్రాకు చేరిన అతను అనారోగ్యానికి గురికావడంతో అక్కడే ఓ ఆసుపత్రిలో చేరాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మా గ్రామానికి దగ్గర్లో ఉన్న రూర్కెలా ఉక్కు కర్మాగారం నుంచి విడుదలవుతున్న వ్యర్ధాల వల్ల గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురవ్వుతున్నారు. 2014 లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత 2015లో ప్రధాని మోడీ మా గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా మా రూర్కెలా ఇస్పాట్ జనరల్ హాస్పిటల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని, బ్రాహ్మణి వంతెనను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లవుతున్నా ఆ హామీ నెరవేర్చలేదు’’ అని తెలిపాడు.
సరైన వైద్యం లభించక తమ ఊరిలో నిత్యం ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారని, ఈ విషయాన్ని మోడీకే కాకుండా యావత్తు దేశానికి తెలిపేందుకే తాను ఈ పాదయాత్ర చేపట్టానని తెలిపాడు. నడుస్తూ ఢిల్లీ చేరుకుని ఆయనకు తమ గ్రామ సమస్యను గుర్తు చేస్తానని చెప్పాడు.