యాప్నగరం

అందుకే నాకు సీఎం పదవి కావాలి: శశికళ

ప్రభుత్వంలో నెలకొన్న సంక్షోభానికి కేంద్రంలోని బీజేపీ, తమిళనాడులోని డీఎంకే పార్టీలే కారణమని

Samayam Telugu 13 Feb 2017, 3:11 pm
ప్రభుత్వంలో నెలకొన్న సంక్షోభానికి కేంద్రంలోని బీజేపీ, తమిళనాడులోని డీఎంకే పార్టీలే కారణమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Samayam Telugu to save party want to become cm says sasikala
అందుకే నాకు సీఎం పదవి కావాలి: శశికళ


తనకు పదవీ వ్యామోహం లేదని చెప్పిన ఆమె..కేవలం పార్టీ కాపాడేందుకే తాను సీఎం పదవిని అధిష్టించాలనుకుంటున్నానని పోయెస్ గార్డెన్ లో ఆమె సోమవారం మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడారు.

అమ్మ (జయలలిత) చనిపోయి పుట్టెడు దు:ఖంలో తానుంటే ఓ పన్నీరుసెల్వం పార్టీని చీల్చే పనిలో నిమగ్నమయ్యారని చిన్నమ్మ ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నిన పార్టీని ఏమీ చేయలేరని ఆమె మరోసారి స్పష్టం చేశారు. పన్నీరుసెల్వం నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు.

ఇప్పటికైనా గవర్నర్ తనను పిలిచి..ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ఆమె మరోసారి కోరారు.

అనంతరం ఆమె గోల్డెన్ బే రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు బయలుదేరారు.

అటు మధ్యాహ్నం 1గంటల ప్రాంతంలో సచివాలయం చేరుకున్న ఓపీఎస్ ఇంకా అక్కడే ఉన్నారు.

ఇదిలా ఉండగా, తమిళనాడులో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.