యాప్నగరం

జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ప్రతీకారం తీర్చుకున్న జవాన్లు

సోమవారం భద్రతా బలగాలపై ఉగ్రవాదుల చేసిన దాడిలో ముగ్గురు అధికారులను మృతిచెందారు. దీనికి ప్రతీకారంగా ఇవాళ బారాముల్లాలో అధికారులు ఉగ్రవాాదుల్ని మట్టుపెట్టారు.

Samayam Telugu 18 Aug 2020, 8:35 am
జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సోమవారం ఉగ్రదాడి జరిగింది. ఈఘటనతో అప్రమత్తమైన అధికారులు బారాముల్లాలో ఉగ్రవాదుల్ని వేటాడారు. తాజాగా జిల్లాలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఓ లష్కరే తోయిబా కమాండర్‌ సహా ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు కూడా గాయాలయ్యాయి. క్రీరి ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకుంది సీఆర్‌పీఎఫ్‌, జమ్ము కశ్మీర్‌ పోలీసులతో కూడిన సంయుక్త బృందం జోరుగా సోదాలు నిర్వహిచింది.
Samayam Telugu జమ్ముకాశ్మీర్ ఎన్‌కౌంటర్
baramulla encounter in jammu kashmir


అక్కడే దాక్కుని ఉన్న లష్కరే కమాండర్‌ సాజద్‌ అలియాస్‌ హైదర్‌ సహా మరో లష్కరే ఉగ్రవాదిని ఎన్ కౌంటర్ చేశారు. ఉత్తర కశ్మీర్‌లో చురకుకుగా పనిచేసే ఉగ్రవాది సాజిద్‌.. టాప్‌ 10 ఉగ్రవాదుల్లో అతడు కూడా ఒకడని అధికారులు తెలిపారు. అనతుల్లా మిర్‌ అనే మరో ఉగ‍్రవాదిని మట్టుబెట్టామని అధికారులు వెల్లడించారు. బారాముల్లాలో భద్రతా బలగాల మీద జరిగిన దాడికి ఇది ప్రతీకారంగా భావిస్తున్నారు.
Read More:కశ్మీర్‌లో ఉగ్రదాడి... పోలీస్ అధికారి, ఇద్దరు జవాన్లు వీర మరణం
సోమవారం ఉగ్రవాదులు చేసిన దాడిలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు సహా ఓ పోలీసు ఉన్నతాధికారి మరణించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు తమ వాహనం నుంచి బయటికి దిగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ ఉగ్రదాడిలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని అన్నారు. గత వారం రోజుల్లో భద్రతా దళాలపై మూడు సార్లు దాడి జరిగాయి. దాడి అనంతరం ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.