యాప్నగరం

రూ. కోటి రివార్డ్ గల టాప్ మావోయిస్ట్ మృతి

మావోయిస్ట్ అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా అలియాస్ మహేష్ అనారోగ్యంతో మృతిచెందినట్టు..

Samayam Telugu 22 Jan 2017, 9:59 pm
మావోయిస్ట్ అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా అలియాస్ మహేష్ అనారోగ్యంతో మృతిచెందినట్టు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీలో కీలకమైన అగ్రనేతగా పేరున్న ప్రశాంత్ బోస్ తలపై జార్ఖండ్ ప్రభుత్వం రూ.1 కోటి రివార్డ్ కూడా ప్రకటించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రశాంత్ బోస్ ఆదివారం దండకారణ్య అటవీప్రాంతంలో మృతిచెందినట్టు మావోయిస్ట్ పార్టీ వర్గాలు తెలిపాయి.
Samayam Telugu top maoist with 1 crore reward prashanth bose alias kishenda died of illness
రూ. కోటి రివార్డ్ గల టాప్ మావోయిస్ట్ మృతి


మావోయిస్టులని మట్టుపెట్టాలనే లక్ష్యంతో 2015 జులైలో నలుగురు కీలకమైన మావోయిస్టు అగ్రనేతల సమాచారం తెలిపిన వారికి భారీ నజరానా ప్రకటించింది. అరవింద్‌జీ అలియాస్ దేవ్ కుమార్ సింగ్, మిసిర్ బెస్రా, ప్రశాంత్ బోస్, వివేక్ చంద్ర యాదవ్‌లపై అప్పటి వరకు వున్న రూ.25 లక్షల నగదు బహుమతిని ఏకంగా రూ.1 కోటికి పెంచుతూ అప్పటి జార్ఖండ్ ప్రభుత్వం 2015 జులై 27న ఆదేశాలు జారీచేసింది. అలా అప్పటి జార్ఖండ్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన ఆ నలుగురు మావోయిస్టులలో ఈ ప్రశాంత్ బోస్ కూడా ఒకరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.