యాప్నగరం

‘దేశ రక్షణ’లో ఆ రాష్ట్ర బాసులే అధికం!

దేశ ఆర్మీ చీఫ్‌గా లెఫ్ట్‌నెంట్ జనరల్ బిపిన్ రావత్, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) అధిపతిగా అనిల్ ధస్మన నియమితులైన సంగతి తెలిసిందే.

TNN 19 Dec 2016, 12:21 pm
దేశ ఆర్మీ చీఫ్‌గా లెఫ్ట్‌నెంట్ జనరల్ బిపిన్ రావత్, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) అధిపతిగా అనిల్ ధస్మన నియమితులైన సంగతి తెలిసిందే. అయితే దేశ భద్రతా బలగాలలో అత్యున్నత స్థానాలను అధిరోహించిన అత్యధిక మంది సైనికులను అందించిన ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచే బిపిన్, అనిల్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. వీరిద్దరూ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌడి గఢ్వాల్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం.
Samayam Telugu top positions in countrys security establishments helmed by men from uttarakhand
‘దేశ రక్షణ’లో ఆ రాష్ట్ర బాసులే అధికం!


పౌడి గఢ్వాల్ జిల్లాలోని గిరి బనెల్‌స్యూన్ గ్రామానికి చెందిన అజిత్ దోవల్ ఇప్పటికే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ చీఫ్ రాజేంద్ర సింగ్ డెహ్రాడూన్ సమీపంలోని ఛక్రత ప్రాంతానికి చెందిన వారు. మిలట్రీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్‌గా ఇటీవల నియమితులైన అనిల్ భట్ కూడా ఉత్తరాఖండ్ వాసే. తెహ్రి గఢ్వాల్‌లో ఈయన మూలాలు ఉన్నాయి.

ఇలా ఎంతో మంది భద్రతా బలగాల ఉన్నతాధికారులు ఉత్తరాఖండ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ‘దైవ భూమి’ (Land of Gods)గా పిలిచే ఉత్తరాఖండ్ ‘వీర భూమి’ (Land of the Brave)గానూ ఖ్యాతి గాంచింది. ‘భద్రతా బలగాల్లో ఎక్కువ మంది ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచే చేరుతున్నారు. ఇదికొ సంప్రదాయంలా కొనసాగుతోంది. ఇక్కడ యువకుల స్వభావం, శారీరక దృఢత్వం వారికి ప్రధాన బలం. అందుకనే వారు ఆర్మీలో ఎక్కువ ప్రభావం చూపగలుగుతున్నారు’ అని ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా నియమితులైన బిపిన్ రావత్ అన్నారు.

నిజానికి ఉత్తరాఖండ్ నుంచి ఉన్నతాధికారులను ఎంపికచేసే సంప్రదాయాన్ని మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్, ఐపీఎస్ ఆఫీసర్ అజిత్ దోవ‌ల్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా 2014లో నియమించింది. ఆ తరవాత భద్రతా బలగాల ఉన్నతాధికారులుగా చాలా మంది ఈ రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.