జమ్మూ కశ్మీర్ అల్లర్లలో అట్టుడుకుతోంది. సోమవారం భద్రతా సిబ్బంది, అల్లరి మూక మధ్య జరిగిన దాడిలో ఓ యువకుడు చనిపోయాడు. దీంతో మంగళవారం అక్కడ పహారా కాస్తున్న భద్రతా సిబ్బందిపై అల్లరి మూక దాడులు చేసింది. ఈ దాడుల్లో 20 మంది పోలీసులు, 40 మంది ఆందోళనకారులు గాయపడ్డారు. కశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన పర్యటకులను సైతం అల్లరి మూక వదిలిపెట్టలేదు. కర్ణాటకలోని మాంద్యా నుంచి 42 మంది పర్యటకులతో వస్తున్న బస్సుపై అల్లరి మూకలు రాళ్లతో దాడి చేశారు. అలాగే అనంత్నాగ్లోని ఖనాబాల్ ప్రాంతంలో కూడా పర్యటకులపై రాళ్ల దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనల్లో పలువురు పర్యటకులకు గాయాలైనట్లు తెలిసింది.
కశ్మీర్లో పర్యటకులపై అల్లరి మూక రాళ్లదాడి
జమ్మూ కశ్మీర్ అల్లర్లలో అట్టుడుకుతోంది. కశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన పర్యటకులపై మంగళవారం అల్లరి మూకలు దాడి చేశారు.
Samayam Telugu 4 Apr 2018, 12:16 am