రైల్లో ఫుట్ బోర్డ్ ప్రయాణం ముగ్గురి ప్రాణాలు తీసింది. మరో నలుగురిని తీవ్ర గాయాలపాలు చేసింది. చెన్నైలోని ఓ లోకల్ ట్రైన్ లో ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్న వారికి సిగ్నల్ స్తంభం తగిలి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటన చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ లో జరిగింది.
రైల్వే అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై బీచ్ నుంచి తిరుమల్ పూర్ వెళ్తున్న స్థానిక ఇఎమ్ యూ ట్రైన్ లో కొంతమంది ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్నారు.
సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ సమీపంలోని సిగ్నల్ స్థంబానికి ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్న వారి వెనుకభాగం తగిలింది (ప్రయాణికుడి షర్ట్ వెనుక భాగం సిగ్నల్ పోల్ లో చిక్కుకుంది) దీంతో అతడు అక్కడికక్కడే పడిపోయాడు. అతడితోపాటున్న మిగతా ఆరుగురు ప్రయాణికులు కూడా పడిపోయారు. ఇందులో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా..మిగతా నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు.
మృతులను పోస్ట్ మార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు రైల్వే పోలీసులు చెప్పారు.
గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటన చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ లో జరిగింది.
రైల్వే అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై బీచ్ నుంచి తిరుమల్ పూర్ వెళ్తున్న స్థానిక ఇఎమ్ యూ ట్రైన్ లో కొంతమంది ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్నారు.
సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ సమీపంలోని సిగ్నల్ స్థంబానికి ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్న వారి వెనుకభాగం తగిలింది (ప్రయాణికుడి షర్ట్ వెనుక భాగం సిగ్నల్ పోల్ లో చిక్కుకుంది) దీంతో అతడు అక్కడికక్కడే పడిపోయాడు. అతడితోపాటున్న మిగతా ఆరుగురు ప్రయాణికులు కూడా పడిపోయారు. ఇందులో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా..మిగతా నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు.
మృతులను పోస్ట్ మార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు రైల్వే పోలీసులు చెప్పారు.