యాప్నగరం

ఢిల్లీలో కంపించిన భూమి.. భూప్రకంపనలతో వణికిన ఉత్తరాది

Earthquake in Delhi | దేశరాజధాని ప్రాంతంలో మంగళవారం సాయంత్రం భూమి కంపించింది. నేపాల్, భారత్ సరిహద్దుల్లో భూకంప కేంద్రం ఉందని గుర్తించారు. భూకంపం ప్రభావంతో ఉత్తరాదిలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి.

Samayam Telugu 19 Nov 2019, 7:52 pm
ఉత్తర భారతదేశంలో స్వలంగా భూకంపం సంభవించింది. మంగళవారం సాయంత్రం భారత్, నేపాల్‌ సరిహద్దుల్లో భూమి కంపించింది. ఈ ప్రభావంతో ఢిల్లీ-నేషనల్ కేపిటల్ రీజియన్‌తోపాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. లక్నో, మురాదాబాద్ తదితర నగరాల్లో ప్రకపంనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Samayam Telugu earthquake


భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదైంది. ఉపరితలం నుంచి 2 కి.మీ. లోతులో భూకంపం సంభవించిందని సమాచారం. భూకంప ప్రభావానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సోమవారం రాత్రి 7 గంటలకు గుజరాత్‌లోని కచ్ జిల్లాలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.