యాప్నగరం

అత్యధిక కేసులున్నా.. బంపర్ మెజార్టీతో గెలుపు

కేసులున్న నేతల్ని పక్కనబెట్టిన గుజరాత్ ప్రజలు.. అత్యధిక క్రిమినల్ కేసులున్న నేతను మాత్రం భారీ మెజార్టీతో గెలిపించారు.

TNN 18 Dec 2017, 6:49 pm
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రిమినల్ కేసులున్న నేతలను ఎన్నుకోమని ప్రజలు తమ ఓటు ద్వారా స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో క్రిమినల్ కేసులున్న నేతలు భారీ సంఖ్యలో ఓటమి చెందారు. కానీ గుజరాత్‌లో భారతీయ ట్రైబల్ పార్టీకి చెందిన మహేష్ వాసవా అనే నేతపై అత్యధిక కేసులు ఉన్నప్పటికీ భారీ మెజార్టీతో గెలుపొందారు. దెడియాపడా నుంచి ఎన్నికల బరిలో దిగిన మహేష్‌పై రెండు మర్డర్ కేసులు సహా 24 కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో అత్యధిక కేసులు ఉన్నది ఆయనపైనే.
Samayam Telugu tribal leader with most number of criminal cases wins big
అత్యధిక కేసులున్నా.. బంపర్ మెజార్టీతో గెలుపు


కేసులున్న మిగతా నేతల్ని ఓడించిన గుజరాతీలు.. దెడియాపడాలో మాత్రం 83,026 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించారు. పఠాన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కీర్తికుమార్ పటేల్‌పై 12 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈయన కూడా 25 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ నియోజకవర్గం నుంచి గోవింద్ సింగ్ థాకూర్ మూడు క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ.. 27 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.