యాప్నగరం

మహిళ నగ్న ఫొటో షేర్ చేసిన ముఖ్యమంత్రి

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాంకు చెందిన బీజేపీ ఎంపీ రాంప్రసాద్ శర్మలపై

Samayam Telugu 21 Jun 2017, 11:56 am
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాంకు చెందిన బీజేపీ ఎంపీ రాంప్రసాద్ శర్మలపై ఓ గిరిజన మహిళపై ఫిర్యాదు చేశారు. తన నగ్న ఫొటోను వీళ్లిద్దరు సోషల్ మీడియాలో షేర్ చేసి, తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
Samayam Telugu tribal woman files case against up cm yogi bjp mp
మహిళ నగ్న ఫొటో షేర్ చేసిన ముఖ్యమంత్రి


అస్సాంలోని బిస్వంత్ జిల్లాలకు చెందిన గిరిజన మహిళ లక్ష్మి ఒరంగ్ సబ్ డివిజనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు.

వివరాల్లోకి వెళ్తే పదేళ్ళ క్రితం (2007లో) గౌహతిలో జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో ఫిర్యాది లక్ష్మి దుస్తులు చిరిగిపోయాయి. అప్పటి తన ఫొటోను ఎంపీ రాంప్రసాద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ పోస్టింగ్ పై యోగి ఆదిత్యనాథ్ కామెంట్ చేశారన్నది అభియోగం. ‘యోగి ఆదిత్యనాథ్ వాస్తవాలు తెలుసుకోకుండా కామెంట్ చేశారు. ఆరోజు జరిగిన ర్యాలీ బీజేపీ పార్టీదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ర్యాలీని అడ్డుకొని దాడి చేశారని వ్యాఖ్యానించారు’ అని లక్ష్మి ఫిర్యాదులో వివరించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహిళా సాధికారత కోసం బేటీ పడావో, బేటీ బచావో అంటుండగా యూపీ సీఎం యోగి మాత్రం.. మహిళలను అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. ఇదే ప్రజాస్వామ్యం అంటే అని ప్రశ్నించారు.

అయితే ఆనాడు జరిగిన సంఘటనకు బాధితురాలైన మహిళకు న్యాయం జరగాలనే తాను ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు ఎంపీ రాంప్రసాద్ చెబుతున్నారు. ఈ కేసును తిరిగి తెరిచి బాధితురాలికి న్యాయం చేయాలని తాను అస్సాం సీఎం సర్బానంద సోనవాల్ ను కోరినట్లు ఆయన అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.