ట్రిపుల్ తలాఖ్ బిల్లు వల్ల అన్యాయమే: అసదుద్దీన్ ఒవైసీ
ట్రిపుల్ తలాఖ్ బిల్లును ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంటులో తీవ్రంగా వ్యతిరేకించారు.
TNN 29 Dec 2017, 10:00 am
ట్రిపుల్ తలాఖ్ బిల్లును ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంటులో తీవ్రంగా వ్యతిరేకించారు. ముస్లిం మహిళలకు ఈ బిల్లు అన్యాయం చేసేలా ఉందన్నారు. న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం ఒవైసీ మాట్లాడారు. గృహహింసపై ప్రస్తుతం ఉన్న చట్టాన్ని సవరిస్తున్న తరుణంలో కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏముందని ఒవైసీ ప్రశ్నించారు. ‘సివిల్ చట్టానికి, క్రిమినల్ చట్టానికి మధ్య తేడాను గ్రహించడంలో న్యాయ శాఖ మంత్రి విఫలమయ్యారు. ఏ ముస్లిం దేశంలోనూ ఇలాంటి శిక్షా నియమం లేదు. ట్రిపుల్ తలాఖ్ అనేది మౌఖిక, భావోద్వేగ దురాచారం’ అని ఒవైసీ వివరించారు.
మా వదిన మాటేమిటి?
ట్రిపుల్ తలాఖ్పై ముసాయిదా బిల్లును రూపొందించే సమయంలో కేంద్రం ముస్లింలను సంప్రదించలేదని ఒవైసీ ఆరోపించారు. లోక్సభ ట్రిపుల్ తలాఖ్ బిల్లును ఆమోదించిన అనంతరం పార్లమెంట్ బయట ఒవైసీ మీడియాతో మాట్లాడారు. ‘ఈ బిల్లు ముస్లిం మహిళలకు అన్యాయం చేసేలా, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉంది. ముస్లిం హహిళలనే కాక దేశవ్యాప్తంగా భర్తలు వదిలేసిన 20 లక్షల మంది గురించి కూడా బిల్లులో ప్రస్తావించి ఉంటే బాగుండేది. వారిలో గుజరాత్లోని మా వదిన కూడా ఉన్నారు’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ సతీమణిని ఉద్దేశించి ఒవైసీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
మా వదిన మాటేమిటి?
ట్రిపుల్ తలాఖ్పై ముసాయిదా బిల్లును రూపొందించే సమయంలో కేంద్రం ముస్లింలను సంప్రదించలేదని ఒవైసీ ఆరోపించారు. లోక్సభ ట్రిపుల్ తలాఖ్ బిల్లును ఆమోదించిన అనంతరం పార్లమెంట్ బయట ఒవైసీ మీడియాతో మాట్లాడారు. ‘ఈ బిల్లు ముస్లిం మహిళలకు అన్యాయం చేసేలా, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉంది. ముస్లిం హహిళలనే కాక దేశవ్యాప్తంగా భర్తలు వదిలేసిన 20 లక్షల మంది గురించి కూడా బిల్లులో ప్రస్తావించి ఉంటే బాగుండేది. వారిలో గుజరాత్లోని మా వదిన కూడా ఉన్నారు’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ సతీమణిని ఉద్దేశించి ఒవైసీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.